Friday, June 6, 2025

ఈటల కన్ఫ్యూజన్ పొలిటీషియన్: చామల

- Advertisement -
- Advertisement -

బిజెపి నాయకులే ఈటలను గుర్తించడం లేదు
ఎంపి చామల కిరణ్ కుమార్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద కన్ఫూజన్ పొలిటీషియన్ ఈటల రాజేందర్ అని, బిజెపి నాయకులే ఆయన్ను గుర్తించడం లేదని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లా డుతూ ఈటల రాజేందర్‌కు పదవి రాలేదని ఒత్తిడితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈటల ఇంట్లో రెడ్డి అని, గేటు బయట ఓబిసి నాయకుడని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చినా ఈటల బిఆర్‌ఎస్ గురించే నిత్యం ఎందుకు మాట్లాడుతున్నారని చామల ప్రశ్నించారు.

పార్టీ అధ్యక్ష పదవి కోసం లెఫ్ట్ వింగ్‌లో ఉన్న ఈటల రైట్ వింగ్‌కు మారారని ఆయన పేర్కొన్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్‌కుమార్ గురించి మాట్లాడే అర్హత ఈటలకు లేదని, మహేష్ కుమార్ గౌడ్ ఎన్‌ఎస్‌యూఐ నుంచి పిసిసి అధ్యక్షుడి స్థాయికి ఎదిగారని ఆయన గుర్తు చేశారు.  ఆవిర్భావ సభలో రేవంత్ రెడ్డి హోదా బిఆర్‌ఎస్ ఇచ్చిందన్న హరీష్‌రావు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడంతోనే నేడు ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి సన్నిహితులు మిస్ ఇంగ్లాండ్‌ను ఇబ్బంది పెట్టారన్న హరీష్ రావు వ్యాఖ్యలు అర్థరహితమని ఆయన మండిపడ్డారు. వీడియో ఆధారాలుంటే బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి మిస్ ఇంగ్లాడ్‌తో బిఆర్‌ఎస్ నాయకులే మాట్లాడించారని ఆయన ఆరోపించారు.అధికార దుర్వినియోగంలో హరీష్‌రావు రోల్ మోడల్‌గా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ నుంచి కాదని, ములుగు అడవుల్లో నుంచి సమీక్ష నిర్వహిస్తారని ఆయన చెప్పారు. ప్రగతి భవన్ అని ప్రగతి లేని భవనం నిర్మిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజా భవన్‌గా మార్చిందని ఆయన తెలిపారు. అమెరికాలో నల్లధనం ఖర్చు పెడితే కెసిఆర్ అధికారంలోకి రారని ఆయన ఎద్దేవా చేశారు. కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం పగటి కలే అని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News