Friday, June 6, 2025

మావోయిస్టులకు భారీ షాక్… 2.5 టన్నుల పేలుడు పదార్థాలు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

భ్రదతా దళాల సెర్చింగ్ ఆపరేషన్
ఐదు రోజుల పాటు అటవీ ప్రాంతంలో జల్లెడ
రహస్యంగా నిల్వ ఉంచిన 2.5 టన్నుల పేలుడు పదార్థాలు స్వాధీనం

మన తెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది. ఒడిశా-ఝార్ఖండ్ సరిహద్దుల్లో మావోయిస్టులు భారీ విధ్వంసానికి పన్నిన కుట్రను భద్రతాదళాలు భగ్నం చేశాయి. మావోయిస్టులు దాచిపెట్టిన సుమారు 2.5 టన్నులకు పైగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ఈ భారీ ఆపరేషన్‌లో ఒడిశా రాష్ట్ర స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌ఒజి), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్), ఝార్ఖండ్ ఎలైట్ జాగ్వార్ ఫోర్స్, సుందర్‌గఢ్ డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ (డివిఎఫ్) కు చెందిన భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. ఈ పేలుడు పదార్థాలను ఒక రాతి క్వారీకి తరలిస్తున్న సమయంలో మావోయిస్టులు వాటిని దోచుకున్నారన్న పక్కా సమాచారంతో ఈ ఉమ్మడి ప్రత్యేక ఆపరేషన్‌ను నిర్వహించారు.

ఈ పేలుడు పదార్థాలు మావోయిస్టుల చేతిలో ఉంటే తీవ్ర కల్లోలం సృష్టించే ప్రమాదం ఉందని భావించిన భద్రతా దళాలు మే 28వ తేదీన ఈ సెర్చింగ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఐదు రోజుల పాటు అటవీ ప్రాంతంలో జల్లెడ పట్టిన బలగాలు, చివరకు మావోయిస్టులు రహస్యంగా నిల్వ ఉంచిన 2.5 టన్నుల పేలుడు పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి. అయితే, ఈ సెర్చింగ్ ఆపరేషన్ సమయంలో భద్రతా దళాలకు మావోయిస్టులు ఎవరూ తారసపడలేదు. దీనితో ఎటువంటి ఎదురుకాల్పులు జరగకుండానే ఈ ఆపరేషన్ ప్రశాంతంగా ముగిసింది. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను భారీ భద్రత నడుమ సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News