Friday, June 6, 2025

రాహుల్ గాంధీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విమర్శలా ?

- Advertisement -
- Advertisement -

బిజెపి నాయకులు అజ్ఞానులుగా మాట్లాడుతున్నారు
టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తమపై విమర్శలు చేయడం బిజెపి నాయకుల అజ్ఞానానికి నిదర్శనమని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బిజెపి నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి 26 మందిని కాల్చి చంపితే, కేంద్ర ప్రభుత్వ ఇంటిలిజెన్స్ ఏం చేసిందో కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

బిజెపి ప్రభుత్వం నిద్రావస్థలో ఉండి రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తూ రాజకీయాలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. యుద్దం జరుగుతుంటే పాకిస్థాన్‌ను మోడీ ఓడిస్తారని దేశం అనుకుంటే, అకస్మాత్తుగా యుద్దం ఆగినట్లు వార్తలు వచ్చి విస్మయానికి గురిచేశాయన్నారు. మోడీ ప్రకటిస్తారని ఎదురు చూస్తే ట్రంప్ యుద్దంపై ప్రకటన చేయడం కేంద్ర ప్రభుత్వ అసమర్ధ తకు నిదర్శనమన్నారు. ట్రంప్ మాటలకు మోడీ తలొగ్గడం పట్ల ప్రజలు వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

వాజ్‌పేయ్ పుట్టిన రోజున మోడీ పాకిస్థాన్‌కు వెళ్లి ఆ దేశ అధ్యక్షుడి కాళ్లు మెక్కలేదా అని ఆయన ప్రశ్నించారు. తప్పులు మీరు చేసుకుంటూ పోతూ ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలపై పోరాడుతున్న రాహుల్ గాంధీపై మాట్లాడటం సమంజసం కాదని ఆయన మండిపడ్డారు. ఆర్టికల్ 370 రద్దు చేసినా ఉగ్రవాదం ఎందుకు వచ్చిందని ఆయన నిలదీశారు. ఇప్పటి వరకు చంపిన ఉగ్రవాది జాడ తెలుసుకోక పోవడం పట్ల సిగ్గుపడాలన్నారు. బిజెపి నేతల ఒళ్లంతా కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News