Friday, June 6, 2025

రాజకీయ వ్యాఖ్యలతో దేశ సమగ్రతకు ముప్పు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఆందోళన

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ సోమవారం దేశంలో రాజకీయ విభజనరేఖల పట్ల తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఎంపిల అఖిలపక్ష బృందంలో భాగంగా ఆయన తూర్పు ఆసియా దేశాల్లో పర్యటించారు. ఉగ్రవాదం పట్ల భారతదేశపు ఉమ్మడి వైఖరిని చాటడం ఈ బృందం అంతర్లీన లక్షం. ఓ వైపు ఈ అత్యుత్తమ సందేశం వెలువరించే ప్రయత్నాల దశలోనే దేశంలోని కొందరు నేతలు కొ న్ని విషయాలపై ఇష్టం వచ్చిన వ్యాఖ్యలకు దిగుతున్నారు. జాతీయ భద్రత సంబంధిత విషయాలను కూడా ప్రస్తావించడం అనుచితం అని ఈ మాజీ విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు.

ఆయన ఇటీవలే ఆర్టికల్ 370పై చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఆయనకు ఇబ్బందికరంగా మారాయి. ఉగ్రవాదంపై పోరుకు దౌత్యం సాగిస్తూ విదేశాలలో ఉన్నప్పుడు దేశంలో చెలరేగుతున్న రాజకీయ వివాదాలతో అసలు లక్షం దెబ్బతింటుందని ఆయన విమర్శించారు. ఇటువంటి వైఖరితో నిజానికి దేశభక్తిని చాటుకునే వారికి గడ్డు పరిస్థితి ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. ఇతర దేశాలకు సరైన రీతిలో దేశం తరఫున ఓ సమగ్ర సందేశం తీసుకుని వెళ్లినప్పుడు అందుకు విరుద్ధంగా ఉండే ఎటువంటి వ్యాఖ్యలకు ఏ పార్టీ నేతలు దిగినా అది జాతీయ ప్రయోజనాలకు విరుద్ధం అవుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News