ప్రజల ఆకాంక్షలే ప్రజాప్రభుత్వ అజెండా
మహిళల ఆర్థిక స్వావలంబనానికి అధిక ప్రాధాన్యం
మహిళా సంఘాల సభ్యులకు క్యూఆర్ కోడ్తో
ఆరోగ్య పరీక్షలు భూ వివాదాలు లేని తెలంగాణ
లక్షంగా భూభారతి సంక్షేమ పథకాలలో సన్న
బియ్యం ఓ చరిత్ర ఫ్యూచర్ సిటీతో మారనున్న
హైదరాబాద్ రూపురేఖలు శాంతిభద్రతల్లో రాష్ట్రం
దేశంలోనే నెంబర్వన్ 2047నాటికి మూడు
ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ అదే
లక్షంతో తెలంగాణ రైజింగ్2047 విజన్
డాక్యుమెంట్ రూపకల్పన 16నెలల్లో 60వేల
ప్రభుత్వ, లక్ష ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించాం
రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం పరేడ్
గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవంలో
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్షంగా తొలి సంవత్సరంలోనే రూ.21వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందచేశాం. అదానీ, అంబానీలతో పోటీ పడాలన్న లక్షంతో ఉపాధి, వ్యాపార రంగంలో మహిళలకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది.
మన తెలంగాణ/హైదారాబాద్ : పదేళ్ల విధ్వంసాన్ని చక్కదిద్దుతున్నామని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. సుదీర్ఘమైన రాష్ట్ర ప్రజల స్వరాష్ట్ర సాధన క లను సోనియాగాంధీ నిజం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. సోమవారం పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భా వేడుకల్లో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం కోసం తాగ్యాలతో రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. పది సంవత్సరాల్లో తెలంగాణలో ఆర్థ్ధిక విధ్వంసం జరిగిందని, బానిసత్వాన్ని నియంతృత్వాన్ని సహించని తెలంగాణ ప్రజా సమాజం గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుందని ఆయన తెలిపారు.
ప్రజల ఆలోచనలే పరమావధిగా ముందుకు…
డిసెంబర్ 7వ తేదీ అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్థవ్యస్థం గా ఉందని సిఎం రేవంత్ తెలిపారు. తాము బాధ్యతలు తీసుకునే నాటికి రాష్ట్రాన్ని చక్కదిద్దడం చాలా కష్టమని అర్ధమయ్యిందన్నారు. అయినా ప్రజ ల ఆలోచనలే పరమావధిగా ప్రజా ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణం దిశగా ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. పదేళ్లలో నిర్వీర్యమైన వ్యస్థలను చక్కదిద్దుతున్నామని సిఎం పేర్కొన్నారు. యూనివర్శిటీలకు విసిలను నియమించామని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసుకున్నామని, సమాచార కమిషనర్ల నియామకం, లోకాయుక్త, హెచ్ఆర్సి సభ్యులను నియమించి స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు.
మహిళా అభ్యున్నతే లక్షంతో….
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్షంగా తొలి సంవత్సరంలోనే రూ.21వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందచేశామన్నారు. మహిళా ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కాలనే శిల్పారామం వేదికగా మహిళా ఉత్పత్తులను అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు. మహిళలకు ఆర్టీసి బస్సులో ఉచిత ప్రయాణ నిర్ణయం చారిత్రాత్మకం అయితే, ఆ బస్సులకు మహిళా సంఘాలను యజమానులుగా రాష్ట్ర ప్రభుత్వం చేసిందని ఆయన తెలిపారు. 150 బస్సులను ఇప్పటికే మహిళా సంఘాలకు అందచేశామని, మరో 450 బస్సులను మహిళల ఆధ్వర్యంలో ఆర్టీసిలో నడపబోతున్నామని చెప్పేందుకు గర్వపడుతున్నామని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లలో మహిళలకు ప్రాధాన్యత కల్పించామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500 లకే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు.
రైతు సంక్షేమమే లక్షం
రైతు సంక్షేమమే లక్షంగా తొలి ఏడాదిలోనే ప్రభత్వం 25,35,964, మంది రైతులకు, రూ. 20,617 కోట్ల రుణాలను మాఫీ చేశామని సిఎం రేవంత్ తెలిపారు. రూ.15,333 కోట్లతో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, ఎకరానికి రైతు భరోసాను రూ. 12 వేలకు పెంపు, వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు, ఎకరానికి రూ.500ల బోనస్ అందించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 2 కోట్ల 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి సాధించామని, పెరిగిన దిగుబడి దళారుల బారిన పకుండా 8 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
యువత విశ్వాసం చూరగొన్నాం
గత ప్రభుత్వం యువతను రాజకీయాలకు వాడుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం యుతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిందని సిఎం రేవంత్ తెలిపారు. 16 నెలల్లో తెలంగాణ పబ్లిక్ కమిషన్ ద్వారా 60 వేల ఉద్యోగాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు. డిఎస్సీ ప్రకటించి 10వేల మంది ఉపాధ్యాయులను నియమించామన్నారు. అంతర్జాతీయ పెట్టుబడులు రావడంతో ప్రైవేటు కంపెనీల ద్వారా సుమారు లక్ష ఉద్యోగాలు యువతకు అందించామన్నారు. వైద్య రంగం, పోలీస్, సింగరేణి కాలరీస్, ఇలా వివిధ రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు భరోసా కల్పిస్తున్నామని సిఎం రేవంత్ తెలిపారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్య ఎక్కువయ్యిందని, నేడు దేశంలో అత్యల్ప నిరుద్యోగం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వం యవత విశ్వాసం చూరగొందన్నారు. యువతకు ప్రిలిమ్స్కు, మొయిన్స్ కోసం లక్ష రూపాయలను అందిస్తున్నామని సిఎం తెలిపారు. రాష్ట్రంలో ఏటా యువత స్కిల్ లేకపోవడంతో సరైన ఉద్యోగాలు లభించక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి, స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేశామన్నారు. క్రీడల్లో యువతను ప్రోత్సహించాలన్న లక్షంతో యంగ్ ఇండియా స్పోర్ట్ అకాడమీ, స్పోర్ట్ వర్శిటీ ఏర్పాటు చేశామన్నారు.
తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్
గురుకులాలు బలోపేతం చేయడానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని సిఎం రేవంత్ తెలిపారు. తొలి దశలో రూ.11,600 కోట్లతో 58 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపట్టామన్నారు. నల్గొండలో ఆ నాటి ప్రధాని పివి ప్రారంభించిన గురుకులాల్లో చదువుకొని నేటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తెలంగాణ పబ్లిక్ కమిషన్ చైర్మన్ ఈ స్థాయిలో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. గురుకులాల్లో చదువుకునే వారికి 40 శాతం డైట్ చార్టీలు, 200 శాతం కాస్మోటిక్ చార్జీలు పెంచిందన్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియాకు పూర్వవైభవం తీసుకు రావాలన్న లక్షంతో 30 ఎకరాల్లో రూ. 2,700 కోట్లతో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశామని ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు.
కులగణన దేశానికే దిక్సూచి
1931వ సంత్సరంలో కులగణన జరిగిందని, 2024,25లో ప్రజా ప్రభుత్వం చేపట్టిన, కులగణన దేశానికే దిక్సూచిగా నిలిచిందని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జనాభాలో 56.36 శాతం ఉన్న బడుగు బలహీన వర్గాలకు న్యాయంగా దక్కాల్సిన 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని సిఎం రేవంత్ తెలిపారు. ఎస్సీ ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించి చట్టబద్దత కల్పించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీని తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా జరపాలని నిర్ణయించామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు నియోజకవర్గానికి రూ. 3,500లు మంజూరు చేస్తున్నామని, రూ. 22,500 కోట్లతో 4లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించే లక్షంతో ముందు కు సాగుతున్నామని సిఎం రేవంత్ తెలిపారు. మే 20 నాటికి 5,364 ఇందిరమ్మ లబ్ధిదారులకు 53 కోట్ల 64 లక్షల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేశామన్నారు. సంక్షేమ పథకాల చరిత్రలో సన్న బియ్యం ఒక ట్రెండ్ సెట్టర్, తెలంగాణలో మూడు కోట్ల మంది సన్నబియ్యం పథకం ద్వారా లబ్ది పొందుతున్నారన్నారు. ఇది విప్లవాత్మక మార్పు అని, ఖమ్మం జిల్లా సారపాకలో స్వయంగా సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేశామని ఆయన అన్నారు. ఆ రోజు వారి కళ్లలో చూసిన ఆనందం నా గుండెల్లో ఎప్పటి నిలిచిపోతుందని పేర్కొన్నారు.
తెలంగాణ రైజింగ్ 2047 లక్షం
స్వాతంత్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే సరికి దేశం ఆర్ధిక వ్యవస్థ 30 ట్రిలియన్స్ లక్షం గా పెట్టుకుందని, దానిలో భాగమయ్యేందుకు తెలంగాణ రైజింగ్ 2047 తో విజన్ డాక్యుమెంటరీ తయారు చేసిందని సిఎం రేవంత్ తెలిపారు. 18 నెలల కాలంలో దావోస్, సింగపూర్, జపాన్ లాంటి దేశాల్లో పర్యటించి రూ. 3 లక్షల కోట్ల రూపాయల పెట్టులను ప్రభుత్వం ఆకర్శించిందని ఆయన అన్నారు. ఐటి దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, హెచ్సిఎల్, కాగ్నిజెంట్ వంటి పెద్ద కంపెనీలు తమ సంస్థలు హైదరాబాద్లో విస్తరిస్తున్నాయని సిఎం రేవంత్ తెలిపారు.
ఫ్యూచర్ సిటీ ఓ మైలురాయి
30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో హైదరాబాద్ రూపురేఖలు మారనున్నాయని సిఎం రేవంత్ తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ ప్రపంచ దేశాల పెట్టుబడులకు స్వర్గాధామంగా ఉండబోతుందన్నారు. హైదరాబాద్కు ఉన్న ఔటర్ రింగ్రోడ్డు ఎంతో ప్రయోజనకరంగా ఉందని, దానికి మరింత ప్రయోజం చేకూర్చేందుకు రూ. 18వేల కోట్లతో రీజనల్ రింగు రోడ్డు ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. పది సంవత్సరాల క్రితం మెట్రోలో దేశంలో రెండో స్థానంలో ఉంటే పది సంవత్సరాలు పట్టించుకోకపోవడంతో అది 12వ స్థానానికి దిగజారిందన్నారు. దీనిని సరి చేసేందుకు రూ. 24 వేల కోట్లతో రెండో దశ నూతన మోట్రో కారిడర్ మార్గాలకు ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టిందన్నారు. రాబోయే 10 ఏళ్లలో రాష్ట్ర ఆదాయం ఒక ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే ప్రభుత్వం లక్షమన్నారు.
శాంతి భద్రతల్లో దేశంలోనే నెం..1
తెలంగాణ పోలీస్ దేశంలోనే నెం.1 స్థానాన్ని పొందిందని, డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణకు ప్రపంచ దేశాల్లో అవార్డులు వచ్చాయని సిఎం రేవంత్ తెలిపారు. పోలీస్ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశామని ఆయన పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలను రాష్ట్రంలో విక్రయించాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు చేపట్టామన్నారు.
టూరిజం వేదికగా తెలంగాణ
ప్రపంచ టూరిజానికి వేదికగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్షంగా ప్రభుత్వం పనిచేస్తోందని సిఎం రేవంత్ తెలిపారు. ప్రపంచ సుందరి పోటీలు కేవలం ఈవెంట్ మాత్రమే కాదని, ప్రపంచ పటంలో తెలంగాణను ఉంచడమే తమ ఉద్దేశ్యమన్నారు.