Friday, June 6, 2025

మొదటి రెండు ర్యాంకులు ఢిల్లీకే

- Advertisement -
- Advertisement -

జెఇఇ అడ్వాన్స్‌డ్2025 ఫలితాల విడుదల
332 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించిన
రజిత్ గుప్త హైదరాబాద్‌కు చెందిన
అర్నవ్ సింగ్‌కు 9వ ర్యాంక్, వడ్లమూడి
లోకేశ్‌కు 10వ ర్యాంకు ఇడబ్లూఎస్,
ఓబిసి కేటగిరిలలో మొదటి ర్యాంకులు
హైదరాబాద్ విద్యార్థులవే

మన తెలంగాణ/హైదరాబాద్:దేశంలో ప్రతిష్టాత్మక ఐఐటీ ల్లో బి.టెక్,బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బి.ఎస్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కో ర్సుల్లో ప్రవేశాలకు సీట్ల భర్తీకి నిర్వహించిన జెఇఇ అడ్వాన్స్‌డ్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన రజిత్ గుప్త 360 మార్కులకు 332 మార్కులు సాధించి జాతీయస్థాయిలో ప్రథమ ర్యాంకు, అదే జోన్‌కు చెందిన సాక్షం జిందాల్ 332 మార్కులతో రెండో స్థానంలో ని లిచారు. ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన అర్నవ్ సింగ్ 9వ ర్యాంకు, వడ్లమూడి లోకేష్ 10వ ర్యాంకు సాధించారు. అ మ్మాయిల విభాగంలో ఐఐటీ ఖరగ్‌పూర్ జోన్‌కు చెందిన దేవ్ దత్త మాఝీ 312 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు.

జనరల్ ఇడబ్లూఎస్ కేటగిరీలో ఐఐటీ హైదరాబాద్‌కు జోన్‌కు చెందిన వంగాల అజయ్‌రెడ్డి టాప్ ర్యాంకు సాధించారు. అలాగే ఒబిసి ఎన్‌సిఎల్ కేటగిరీలో ఐఐటీ హైదరాబాద్ జోన్‌కు చెందిన ధర్మాన జ్ఞాన రుత్విక్ సాయి, ఎస్‌సి కేటగిరీలో ఐఐటీ ఖాన్‌పూర్ జోన్‌కు చెందిన శ్రీయాస్ లోహియా, ఎస్‌టి కేటగిరీలో పార్థ్ సెహ్రా మొదటి ర్యాంకు పొందారు. మే 18న జరిగిన ఈ పరీక్ష ఫలితాలను ఐఐటీ కాన్పూర్ సోమవారం విడుదల చేసింది. ఈ పరీక్షకు 1,80,422 మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 54,378 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వారిలో 44,974 మంది అబ్బాయిలు ఉండగా, 9,404 మంది అమ్మాయిలు ఉన్నారు. ఫలితాల కోసం https:// jeeadv.ac.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

పెరగనున్న సీట్లు

దేశవ్యాప్తంగా దాదాపు 1.80 లక్షల మంది విద్యార్థులు జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరుకాగా, వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మంది ఉంటారని అంచనా. గతేడాది కటాఫ్ మార్కుల ఆధారంగా మొత్తం 48,248 మందికి జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హత కల్పించారు. వారు మాత్రమే ఐఐటీల్లో సీట్లు పొందేందుకు అర్హులు. గత విద్యాసంవత్సరం (202425) 23 ఐఐటీల్లో 17,760 సీట్లు అందుబాటులో ఉండగా.. మద్రాస్ ఐఐటీ సహా పలు ఐఐటీల్లో కొత్త కోర్సులు ప్రవేశ పెట్టడంతో ఈసారి సీట్లు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.మంగళవారం(జూన్ 3) సాయంత్రం 5 గంటల నుంచి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా)-2025 కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది.

ఆరు విడతల్లో జోసా కౌన్సెలింగ్

దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే ఇతర సాంకేతిక విద్యాసంస్థల్లో సీట్ల భర్తీకి ఈసారి ఆరు విడతల జోసా కౌన్సెలింగ్ జరగనుంది. ఐఐటీ కాన్పుర్ ఇటీవల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా)-2025 వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. గత ఏడాది ఐదు రౌండ్లలో కౌన్సెలింగ్ జరుగగా, ఈసారి ఆరు విడతల్లో నిర్వహించనున్నారు. మంగళవారం(జూన్ 3) రిజిస్ట్రేషన్లు, ఛాయిస్ ఫైలింగ్ చేపట్టనుండగా.. జూన్ 9, 11 తేదీల్లో మాక్ సీట్ అలాట్‌మెంట్ 1,2… జూన్ 12న ఫైనల్ ఛాయిస్ లాకింగ్ జరగనున్నాయి. అనంతరం ఒకటో విడత జోసా కౌన్సిలింగ్: జూన్ 14, రెండో విడత: జూన్ 21, మూడో విడత: జూన్ 28, నాలుగో విడత: జులై 4, ఐదో విడత: జులై 10, ఆరో విడత: జులై 16 తేదీల్లో నిర్వహించనున్నారు.
మొదటి 10 ర్యాంకర్లు వీరే
1. రజిత్ గుప్త
2. సాక్షం జిందాల్
3. మాజిద్ ముజాహిద్ హుస్సేన్
4. పార్థ్ మందర్ వర్తక్
5. ఉజ్జల్ ఈసరి
6. అక్షత్ కుమార్ చౌరాసియా
7. సాహిల్ ముకేష్ డియో
8. దేవేష్ పంకజ్ భయ్యా
9. అర్నవ్ సింగ్
10. వడ్లమూడి లోకేష్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News