- Advertisement -
బిఆర్ఎస్ అధినేత వినతితో విచారణ తేదీని మార్చిన కమిషన్
మన తెలంగాణ / హైదరాబాద్ : కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈనెల 5వ తేదీన తాను కమిషన్ ముందు హాజరుకాలేనని తనకు మరికొంత సమయం ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కమిషన్ చైర్మన్ జస్టీస్ పిసి ఘోష్ ను కోరినట్లు తెలిసింది. మాజీ సిఎం సూచన మేరకు కమిషన్ ఈనెల 11వ తేదీన హాజరుకావాలని సూచించనట్లుగా సమాచారం. ఇదిలా ఉండగా ఈనెల 9వ తేదీన మాజీ మంత్రి తన్నీరు హరీష్రావు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకానున్నారు. ఈనెల 6వ తేదీన మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై తన వాదనలను వినిపిస్తానని ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
- Advertisement -