Thursday, June 19, 2025

ఒట్టేసి చెబుతున్నా… తెలంగాణ అభివృద్ధి నా బాధ్యత: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రా న్ని తిరిగి అభివృద్ధి వైపు నడిపించడం భారతీయ జనతాపార్టీకే సాధ్యమని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నీతి, నిజాయితీతో అభివృద్ధి సాధిస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శా ఖా మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశా రు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా, అభివృద్ధి చేస్తామని ఒట్టేసి చెబుతూ తెలంగాణ రా ష్ట్రాన్ని నీతి, నిజాయితీతో, అంకితభావంతో అభివృద్ధి చేస్తామని, ఇది బి జెపి మాట అని హామీ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబపాలన,బీఆర్‌ఎస్, కాం గ్రెస్‌ల దోపిడీ పాలనకు తెరదించాల ని, రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరాల ని ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఉదయం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బీజేపీ అన్ని జిల్లాల్లో ఉత్సాహంగా, ఘనంగా జరుపుకుంటోందన్నారు. తెలంగాణ ప్రజలందరికీ బీజేపీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమం ప్రపంచ చరిత్రలో అహింసాయుతంగా సాగిన ప్రబలమైన పోరాటంగా గుర్తించదగ్గదని చెప్పారు. తెలంగాణ కోసం 1200 మందికిపైగా యువతులు, విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారని, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఢిల్లీ పార్లమెంట్ వరకు ఆందోళనలు కొనసాగినట్లు గుర్తు చేశారు. అన్ని పార్టీలకన్నా ముందుగా బీజేపీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నదని, జేఏసీలో చేరిన ఏకైక జాతీయ పార్టీ బీజేపీనేనని పేర్కొన్నారు.

బంగారు తెలంగాణ రాలేదు.. కెసిఆర్ కుటుంబం మాత్రం బంగారమైంది

కెసిఆర్ హామీ ఇచ్చిన బంగారు తెలంగాణ సాధించలేదని, ఆయన కుటుంబం మాత్రం బంగారమైందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా నడిపారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. గతంలో సోనియాగాంధీని తెలంగాణ పాలిట దెయ్యం అన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి రాగానే ఆమెను దేవతగా పొగడటం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. మిగులు బడ్జెట్‌తో ప్రారంభమైన తెలంగాణ ఈ రోజు రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, ఇది టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనల వల్లే అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News