- Advertisement -
గరిడేపల్లి: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదంలో జరిగింది. గేదెను బైక్ ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం…. కోదండాపురం గ్రామానికి చెందిన మచ్చ సందీప్ అనే యువకుడు అమ్మమ్మ ఊదురు పెద్దవీడు నుంచి సొంతూరు తిరిగి వస్తుండగా రాయిని గూడెం సమీపంలో గేదె ఎదురుగా రావడంతో ఢీకొట్టాడు. సందీప్ తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. సందీప్ను 108లో హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -