- Advertisement -
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ తల్లి ఆశీస్సులతో సాయి లక్ష్మీ గణపతి మూవీ క్రియేషన్స్ బ్యానర్పై సత్యం రాజేష్, శ్రవణ్ , కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో ఎన్. కె దర్శకత్వంలో గ్రంధి త్రినాధ్ నిర్మిస్తున్న చిత్రం ‘పాడేరు 12వ మైలు’.(Paderu 12th Mile) సుహాన హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రం జూన్ 6న థియేటర్స్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ఎన్.కె మాట్లాడుతూ పొలిమేర , పొలిమేర 2 తరువాత సత్యం రాజేష్ నటించిన పాడేరు 12వ మైలు సినిమా సస్పెన్స్, లవ్ ఎలెమెంట్స్తో రాబోతోందని అన్నారు. నిర్మాత గ్రంధి త్రినాధ్ మాట్లాడుతూ ఇదివరకు మేము విడుదల చేసిన టీజర్, సాంగ్స్కు మంచి స్పందన లభించింది. సినిమా కూడా నచ్చుతుందని నమ్మకంగా ఉంది”అని తెలిపారు.
- Advertisement -