- Advertisement -
హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ చాపకిందనీరులా విస్తరిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కేరళ, కర్నాటక రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో కరోనా కేసులు నమోదు కావడంతో ఆందోళన కలిగిస్తోంది. దేశం వ్యాప్తంగా ప్రస్తుతం 4026 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా 24 గంటల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. ప్రస్తుతం ఉన్న కరోనా అంత ప్రమాదకరం కాకున్నా వయసు మీదపడిన వారు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నవారు చనిపోతున్నారు.
- Advertisement -