ఐపిఎల్ (IPL) ట్రోఫీని ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముద్దాడింది. ఈ క్రమంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కింగ్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించే. ఐపిఎల్ ఆరంభం నుంచి 18 సీజన్లుగా ఓకే ఫ్రాంచైజీతో(ఆర్సిబి) ఉంటూ.. ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్నాడు కోహ్లీ. మంగళవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన ఫైనల్స్తో ఆర్సిబి కప్పు గెలవడంతో కోహ్లీ భావోద్వేగానికి లోనయ్యాడు. మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాగా, ట్రోఫీని గెలిచిన తర్వాత కోహ్లీ (Virat Kohli) సోషల్మీడియాలో తొలి పోస్ట్ పెట్టాడు.
‘‘ఈ జట్టు ఇన్నాళ్ల కలను నెరవేర్చింది. ఈ ఐపిఎల్ (IPL) సీజన్ను ఎప్పటికీ మర్చిపోలేను. 2.5 నెలలుగా జరిగిన ఈ ప్రయాణాన్ని ఎంతో ఎంజాయ్ చేశాను. ఈ విజయం క్లిష్ట సమయాల్లో కూడా ఆర్సిబికి అండగా నిలిచి ఫ్యాన్స్కి అంకితం. ఎన్నో ఏళ్లుగా అనుభవించిన నిరాశకు ఇది సమాధానం. జట్టు కోసం మైదానంలో కృషి చేసిన ప్రతీ ఆటగాడి విజయం ఇది. ఐపిఎల్ ట్రోఫీ.. నిన్ను అందుకొనేందుకు 18 సంవత్సరాలు ఎదురుచూశా మై ఫ్రెండ్.. ఆ విలువైన ఎదురుచూపులకు తగిన ఫలితం దక్కింది’’ అంటూ విరాట్ సోషల్మీడియాలో పోస్ట్ చేశాడు.