Saturday, June 7, 2025

ఊహించని రీతిలో జనం వచ్చారు: సిఎం సిద్ధరామయ్య

- Advertisement -
- Advertisement -

ఊహించిన దానికన్నా ఎన్నోరెట్ల మంది జనం రావడం వల్లనే తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందని ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య మీడియా సమావేశంలో చెప్పారు. స్టేడియం కెపాసిటీ 35 వేలు కాగా 2 3లక్షల మంది జనం తమ అభిమాన క్రికెట్ జట్టు విజయోత్సవంలో పాల్గొనడానికి స్టేడియం వద్దకు చేరుకున్నారని ఆయన చెప్పారు. తొక్కిసలాటలో 11 మంది చనిపోయారని, మరో 33మంది తీవ్రంగా గాయపడ్డారని ముఖ్యమంత్రి చెప్పారు. ‘ఇది చాలా తీవ్రమైన దుర్ఘటన. దాదాపు 14 మంది ఔట్‌పేషంట్లుగా చికిత్స తీసుకున్నారు. నేను బౌరింగ్ ఆస్పత్రిని సందర్శించి క్షతగాత్రులను పరామర్శించాను. ఇలాంటి ఘటన ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు.

ఘటనపై ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది’ అని ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో చేసిన ప్రకటనలో తెలిపారు. ‘జనం ఊహించినదానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ మంది వచ్చారు. విధాన సౌధ ముందు దాదాపు లక్ష మంది జనం చేరారు. అయితే అక్కడ ఎలాంటి ఘటనా చోటు చేసుకోలేదు. అయితే చిన్నస్వామి స్టేడియం వద్దనే మరణాలు సంభవించాయి. కర్నాటక క్రికెట్ అసోసియేషన్ కానీ, ప్రభుత్వం కానీ ఎవరు కూడా ఇంత మంది జనం వస్తారని భావించలేదు. స్టేడియంలో 35 వేల సీటింగ్ కెపాసిటీ ఉంది. అంతకంటే కాస్త ఎక్కువ మంది వస్తారని మేము అనుకున్నాం. అయితే దాదాపు 2 3లక్షల మంది అక్కడ గుమికూడారు’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News