కెసిఆర్ను బద్నాం చేసేందుకే కాళేశ్వరం
కమిషన్ రాజకీయ దురుద్దేశంతోనే
నోటీసులు బనకచర్లను రేవంత్రెడ్డి
ఎందుకు అడ్డుకోవడం లేదు? 8మంది
బిజెపి ఎంపిలున్నా.. రాష్ట్రానికి
ఎనిమిది రూపాయలు రాలేదు
ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన
ధర్నాలో బిఆర్ఎస్ ఎంఎల్సి కవిత
మన తెలంగాణ/ హైదరాబాద్ : రాజకీయ దురుద్దేశంతోనే మాజీ సిఎం కెసిఆర్కు నోటీసులు ఇ చ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వి మర్శించారు. నోటీసులను నిరసిస్తూ బుధవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో కవి త మాట్లాడుతూ కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. ఆయనకు ఇచ్చారంటే మొత్తం తెలంగాణకు ఇచ్చినట్లే అని పేర్కొన్నారు. తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడమే కేసీఆర్ చేసిన తప్పా అని నిలదీశారు. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు, కాంట్రాక్టర్ల కో సమే పని చేస్తోందని కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన కమిషన్ ఈ ప్రాజెక్టు కోసం 90 శాతం పంప్ హౌస్ లు క ట్టిన మెఘా కృష్ణారెడ్డికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్ర శ్నించారు. కేవలం కుట్రపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.
కేసీఆర్ ఏం తప్పు చేశారని ఆయనకు నోటీసులు ఇచ్చారని నీళ్లు తీసుకురావడం ఆయన చేసిన తప్పా? తెలంగాణను అ భివృద్ధి పథంలో నడిపించడం తప్పా అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మూడు బ్యారేజీలేనా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వేసిన కమిషన్ కాళేశ్వరం కమిషన్ కాదని అది కాంగ్రెస్ కమిషన్ అని ఆరోపించారు. కేసీఆర్ కాబట్టి కాళేశ్వరం లాంటి మల్టీలెవల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆలోచన చేశారని అదే కాంగ్రెస్ ఇటువంటి ప్రాజెక్టును ఏనాడైనా ఆలోచన చేసిందా అని ప్రశ్నించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో తెలంగాణకు కేవలం 16 టీఎంసీలు మాత్రమే వచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తే దాన్ని కేసీఆర్ మార్చి 141 టీఎంసీలకు పెంచారని చెప్పారు. కాళేశ్వరంతో కేసీఆర్ కు పేరు వస్తుందని ఆయన్ను బద్నాం చేయడానికి కుట్ర చేస్తోందన్నారు. నీళ్లిచ్చిన కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే ఇది నిజంగా సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులారా కబర్దార్ అని హెచ్చరించారు. గోదావరి నుంచి 200 టీఎంసీల నీళ్లను బనకచర్ల ప్రాజెక్టుకు ఎత్తుకుపోతానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాలర్ ఎగరేసి చెబుతుంటే దీన్ని అడ్డుకునేలా లేఖ రాయడానికి సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు ధైర్యం రావడం లేదని ప్రశ్నించారు.
జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యత ఈటల తీసుకోవాలి
కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డకు చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయట్లేదు. తెలంగాణ నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే సీఎం రేవంత్రెడ్డి స్పందించట్లేదు. గోదావరి-పెన్నా అనుసంధానం పేరిట నీళ్ల తరలింపును అడ్డుకోవాలి. బీజేపీ లో ఉన్న తెలంగాణ బిడ్డ ఈటల రాజేందర్ కూడా మాట్లాడకపోవడం శోచనీయం అన్నారు. గోదావరి-బనకచర్లను ఆపే బాధ్యతను ఆయన తీసుకోవాలి. కాళేశ్వరానికి జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యతను కూడా ఈటల తీసుకోవాలని కవిత అన్నారు. అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని ఎందుకు అడగడం లేదన్నారు. బనకచర్లను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. తుపాకుల గూడెం వద్దే లింకేజ్ పాయింట్ ఉండాలని తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ద్రోహం చేస్తుంటే బీజేపీ మౌనంగా ఉందన్నారు. చంద్రబాబుపై ఆధారపడే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని అందువల్లే చంద్రబాబు తెలంగాణ జల దోపిడి చేస్తున్నా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఒక్క మాట మాట్లాడటం లేదన్నారు.
బీజేపీలో ఈటల రాజేందర్ అన్న ఒక్కరే తెలంగాణ బిడ్డ ఉన్నారు. ఆయన సైతం మాట్లాడం లేదన్నారు. పదవుల కోసం పెదవులు మూసుకున్నారన్న అపవాదు ఈటల అన్న తెచ్చుకోవద్దన్నారు. గోదావరి, పెన్నా లింకేజ్ పాయింట్ తుపాకుల గూడెం వద్దనుంచే ఉండేలా ఈటల రాజేందర్ ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలన్నారు. తెలంగాణకు నీళ్ల విషయంలో జరుగుతున్న అన్యాయం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ చర్యలు తీసుకోకపోతే తెలంగాణ జాగృతి తరపున కార్యాచరణ తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా కవిత తన స్పీచ్ ను కాసేపు ఉర్దులో కొనసాగించడం ఆసక్తిగా మారింది. ఎల్కతుర్తి సభలో ఉర్దులో కేసీఆర్ మాట్లాడకపోవడాన్ని, బీజేపీపై విమర్శలు చేయకపోవడాన్ని కవిత తన లేఖలో కీలకంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మీటింగ్ లో కవిత ఉర్దులో మాట్లాడటంతో పాటు బీజేపీపై విమర్శలు గుప్పించారు. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా తెలంగాణకు 8 రూపాయలు నిధులు తేలేకపోయారని ఆమె విమర్శలు సంధించారు.
కాగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరూ ఈ ధర్నాకు హాజరు కాకపోవడం గమనార్హం. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఉపాధ్యక్షులు దాస్యం విజయభాస్కర్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రావు, యువజన రాష్ట్ర అధ్యక్షులు సంపత్ గౌడ్, మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు మరిపెల్లి మాధవి, విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు రాము యాదవ్, జాగృతి నాయకులు అప్పాల నరేందర్ యాదవ్, జాగృతి ఇటలి అధ్యక్షుడు తానింకి కిషోర్ యాదవ్, పబ్బోజు విజేందర్, ఈగ సంతోష్, అర్చన సేనాపతి, మాడ హరీశ్ రెడ్డి, లలిత యాదవ్, పరకాల మనోజ్ గౌడ్, మహేందర్ ముదిరాజ్, యూపీఎఫ్ కన్వీనర్ బొల్లా శివశంకర్, కో ఆర్డినేటర్ ఆలకుంట హరి, యూపీఎఫ్ కో కన్వీనర్లు ఆర్ వి మహేందర్, కోల శ్రీనివాస్, నరహరి, విజయేంద్ర సాగర్, ఏల్చల దత్తాత్రేయ, గొరిగే నరసింహ, టి నరేష్ కుమార్, డి కుమార స్వామి, కే ప్రవీణ్, రాచమల్ల బాలకృష్ణ, మురళి కృష్ణ, సల్వా చారి తదితరులు పాల్గొన్నారు.