- Advertisement -
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సర్కార్ చేతకాని తనంతో ఈ ఘటన చోటుచేసుకుందని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ ఘటనపై గురువారం కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణక్ష్యంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. కనీస భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ దురుదృష్టకర ఘటనకు బాధ్యత వహిస్తూ.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఈ ఘటనలో డిప్యూటి సిఎం డికె శివకుమార్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. థియేటర్ తొక్కిసలాటలో ఒకరు చనిపోతేనే హీరో అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు కదా?.. అక్కడా ఉన్నది మీ ప్రభుత్వమే కదా? అని కేంద్రమంత్రి అన్నారు.
- Advertisement -