- Advertisement -
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టుపై కేసు నమోదైంది. ఈ ఘటనలో పదకొండు మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 50 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. ఈ క్రమంలో ఆర్సిబీ జట్టుతోపాటు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(KSCA), విక్టరీ పరేడ్.. విజయోత్సవ వేడుకను నిర్వహించిన DNA నెట్వర్క్స్ పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
కబ్బన్ పార్క్ పోలీసులు FIR దాఖలు చేశారని, దీనిని సెంట్రల్ డిప్యూటీ కమిషనర్ శేఖర్ హెచ్ టెక్కన్నవర్ ధృవీకరించారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కబ్బన్ పార్క్ పోలీసులు.. నేరపూరిత నిర్లక్ష్యం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు, ఈ తొక్కిసలాట ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి అప్పగించినట్లు తెలుస్తోంది.
- Advertisement -