Saturday, June 7, 2025

ఒంగోలులో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి

- Advertisement -
- Advertisement -

ఎపిలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే స్టేషన్ సమీపంలో వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రెండు బోగీల అద్దాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దీంతో నిందితుల కోసం రైల్వే పోలీసులు గాలిస్తున్నారు. ప్రతి రోజు సికింద్రాబాద్ నుంచి తిరుపతి, అదేవిధంగా తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వందేభారత్ రైలు సర్వీసు కొనసాగుతోంది. రోజు మాదిరిగానే సికిం ద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లింది.. తిరిగి సికింద్రాబాద్‌కు వస్తుండగా రైలుపై దుండగులు ఒంగోలులో దాడి చేశారు.

ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రయాణికులను తక్కువ సమయంలోనే గమ్య స్థానాలకు చేర్చుతున్న వందే భారత్ రైలుపై కొందరు దుశ్చర్యకు పాల్పడుతున్నారు. ఏదో ఒక చోట వందేభారత్ రైలుపై దాడులకు తెగబడుతున్నారు. ఇప్పటికే పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. అయినా దుండ గులు చెలరేగిపోతున్నారు. దీంతో వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News