- Advertisement -
కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరుపై టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు తమ పనితీరును బేరీజు వేసుకోవాలని చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. “మెజారిటీ ఎమ్మెల్యేల పనితీరు సరిగాలేదు.. మార్చుకోండి. ఈ నెలలోనే పిసిసి కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు తమ పనితీరు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది” అని చెప్పారు. కార్యకర్తలు నిరాశగా ఉన్నారని.. వారిని సమన్వయం చేసుకునే బాధ్యత మనపైనే ఉందన్నారు.
పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నమాట వాస్తవమని.. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలని మహేశ్కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
- Advertisement -