- Advertisement -
సికింద్రాబాద్ వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు మృతి చెందిన ఘటన ఈరోజు చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..బస్సు డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. టిజి ఆర్టీసి బస్సు పటాన్ చెరు నుండి సికింద్రాబాద్ వెళ్తుంది. బాలానగర్ శోభన థియేటర్ వద్ద కు రావనే ఒక్క సరిగా ప్రయాణికుడు కుప్పకూలి సీటుపై పడ్డాడు. వెంటనే గమనించిన కండక్టర్ బస్సు డ్రైవర్ కు విషయం చెప్పడంతో డ్రైవర్ బస్సును పక్కకు ఆపి వెళ్లి చూడగా అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందాడు. వెంటనే డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు గుండె పోటుతో మృతి చెంది ఉంటాడని తెలిపారు. చనిపోయిన వ్యక్తి ఈసీఐఎల్ ఎస్బీఐ బ్యాంక్ లో పని చేసే ఉద్యోగి గా పోలీసులు గుర్తించారు.
- Advertisement -