Saturday, June 7, 2025

కెనడాలో జి7 సదస్సుకు హాజరు కానున్న ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

ఈ నెల కెనడాలో జరుగనున్న జి7 సదస్సుకు హాజరు కాబోతున్నారు ప్రధాని మోడీ. అంతేకాక కెనడాకు కొత్తగా ఎన్నికైన మార్క్ కార్నీతో కూడా సమావేశం కానున్నారు. కననాస్కిలో జరిగే శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం పంపినందుకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా కార్నీ ఆయనకు ఫోన్ చేశారు. ‘ఇరు దేశాల ప్రజలకు ప్రజలకు మధ్య లోతైన సంబంధాలతో ముడిపడి ఉన్న శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా, భారత్,కెనడా పరస్పర గౌరవం,

ఉమ్మడి ఆసక్తుల మార్గనిర్దేశనలో, నూతన శక్తితో కలిసి పనిచేస్తాయి. శిఖరాగ్ర సమావేశంలో మన భేటీకి ఎదురు చూస్తున్నాను’ అని మోడీ ‘ఎక్స్’లో రాశారు. ఎన్నికల్లో గెలిచినందుకు కూడా మార్క్ కార్నీని ప్రధాని మోడీ అభినందించారు. ఆయనకు ముందు కెనడాకు ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడో హయాంలో భారత్, కెనడా దేశాల మధ్య అనేక విషయాల్లో పొరపొచ్చలు ఏర్పడ్డాయి. ప్రధానంగా ఖలిస్థాన్ వేర్పాటువాదుల కారణంగా ఇరు దేశాల మధ్య వైరుధ్యం ఏర్పడిందన్నది గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News