Saturday, June 7, 2025

రాజేంద్రనగర్‌లో వృద్ధ దంపతుల దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

ఇద్దరు వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఫిజియోథెరపిస్ట్టులుగా వాచ్‌మెన్‌కు చెప్పి ఆ వృద్ధ దంపతుల ఇంట్లోకి వెళ్లిన దుర్మార్గులు అత్యంత దారుణానికి పాల్పడ్డారు. తీవ్ర సంచలం సృష్టించిన ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం… రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఫేక్ అబ్దుల్ (70), ఆయన సతీమణి విశ్రాంత లెక్చరర్ రిజ్వానా బేగం (67)లు 40 రోజుల క్రితం జన చైతన్య ఫేస్2లోని అపార్ట్‌మెంట్‌లోని ఐదవ అంతస్తులో ప్రత్యేకంగా నిర్మించుకున్న డూప్లెక్స్ ఇంట్లోకి వచ్చారు. అంతకు ముందు నగరంలోని రెడ్‌హిల్స్‌లో నివాసం ఉండేవారని తెలిసింది. కాగా, రిజ్వానా, అబ్దుల్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. ఇద్దరు కుమారులు అమెరికాలో ఉంటుండగా, ఇద్దరు కుమార్తెలు లండన్‌లో నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం అమెరికాలోని కుమారుల వద్దకు వెళ్లి కొంతకాలం అక్కడే ఉండి వచ్చిన రిజ్వానా, అబ్దుల్ దంపతులు జన చైనత్య కాలనీలోని వారికి చెందిన అబ్రేజ్ రెసిడెన్సీలో నాలుగు అంతస్తుల్లో ఫ్లాట్లకు అద్దెకు ఇవ్వగా, ఐదవ అంతస్తులోని డూప్లెక్స్‌లోకి మాకం మార్చారు.

కాగా, ఈనెల 5వ తేదీ సాయంత్రం 5 గంగటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు అబ్దుల్ నివాసానికి ఫిజియోథెరపి చేయడానికి వచ్చినట్లు వాచ్‌మెన్‌కు చెప్పారు. దీంతో వాచ్‌మెన్ యజమాని అబ్దుల్‌కు ఫోన్ చేసి విషయం తెలిపాడు. అబ్దుల్ నివాసం ఉంటున్న ఐదవ అంతస్తుకు వెళ్లిన ఇద్దరిలో మాస్క్ ధరించిన వ్యక్తి కొద్ది నిముషాలలోపే కిందకు దిగి వెళ్లిపోయాడు. ఆ తరువాత 40 నిముషాల వ్యవధిలో ఆడ మనిషిగా బురకా ధరించిన వ్యక్తి గుట్టు చప్పుడు కాకుండా అక్కడి నుంచి వెళ్లినట్లు సీసీ టీవీలో రికార్డు అయినట్లు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా రాత్రి 8 గంటల సమయంలో వాచ్‌మెన్ యజమానికి అబ్దుల్‌కు ఫోన్ చేయగా, లిఫ్ట్ చేయలేదు. దీంతో వారు నిద్రించి ఉంటారనుకున్న వాచ్‌మెన్ నిమ్మకుండిపోయాడు. ఉదయం 10 గంటల ప్రాంతంలో మంచినీళ్ల తెచ్చుకోవడానికి 5వ అంతస్తుకు వెళ్లిన వాచ్‌మెన్‌కు అబ్దుల్ ఇంటి డోర్లు తీసి ఉండడం గమనించాడు. యజయానికి పిలువగా ఎలాంటి సమాధానం రాకపోవడంతో దర్వాజ వద్దకు వెళ్లి చూడగా ఇంట్లో ఇద్దరు దంపతులు రక్తపు మడుగులో పడి ఉన్నారు.

వెంటనే విషయాన్ని అపార్ట్‌మెంట్ వాసులకు తెలుపగా, వారు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. ఇద్దరు అప్పటికే ఇద్దరు దంపతులు రక్తపుమడుగులో మృతి చెందారు. మృతుడు అబ్దుల్ శరీరం పై ఏడు చోట్ల కత్తిపోట్లు ఉండగా, రిజ్వాన్ ఛాతిపై ఒక కత్తిపోటు ఉన్నట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమ్మిత్తం మార్చురీకి తరలించిన పోలీసులు క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపారు. హంతకులు హత్యకు ఉపయోగించిన కత్తికి సంబంధించిన ప్లాస్టిక్ పౌస్ కూడా సంఘటనా స్థలి సమీపంలోనే గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News