టీమిండియా సీనియర్ ఆటగాడు పీయూష్ చావ్లా అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని శుక్రవారం చావ్లా ఇన్స్టా వేదికగా ప్రకటించాడు. 36 ఏళ్ల పీయూష్ మూడు ఫార్మాట్లలోనూ భారత్కు ప్రాతినిథ్యం వహించాడు. 2007లో టి20 వరల్డ్కప్, 2011 వన్డే ప్రపంచకప్ సాధించిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కెరీర్లో చావ్లా 3 టెస్టులు, 25 వన్డేలు, 7 టి20 మ్యాచ్లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో చావ్లాకు ఎక్కువ అవకాశాలు లభించలేదు. అయితే దేశవాళీ క్రికెట్లో మాత్రం మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కెరీర్లో 446 ఫస్ట్ క్లాస్ వికెట్లు, మరో 319 టి20 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. చావ్లా దేశవాళీ క్రికెట్లో ఉత్తరప్రదేశ్కు ప్రాతినిథ్యం వహించాడు. అంతేగాక ఐపిఎల్లో పలు ఫ్రాంచైజీల తరఫున ఆడాడు. 2012, 2014లలో ఐపిఎల్ ట్రోఫీలు సాధించిన కోల్కతా నైట్రైడర్స్ జట్టులో చావ్లా ఉన్నాడు.
క్రికెట్కు పీయూష్ చావ్లా గుడ్బై
- Advertisement -
- Advertisement -
- Advertisement -