బిఆర్ఎస్కు సిఎం సరికొత్త భాష్యం
పార్టీలో దయ్యాలు చేరాయని
వాళ్ల నేతలే చెప్పుకుంటున్నారు
వాటిని తరిమికొట్టే బాధ్యత నాది
ఇన్స్టాల్మెంట్లో ఉద్యోగులకు
జీతాలు ఇచ్చినోళ్లు నన్ను ప్రశ్నిస్తారా?
ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన
చేసి తీరుతాం దత్తత పేరిట
వాసాలమర్రిని స్మశానంగా చేశారు
పదేళ్లలో నల్లగొండ ప్రాజెక్టులు
ఎందుకు పూర్తి చేయలేదు? కెసిఆర్కు
ఒక్క నోటీసు ఇస్తేనే ఆగమాగమైతున్నరు
తిర్మలాపురం సభలో సిఎం రేవంత్
వ్యాఖ్యలు రూ.వెయ్యి కోట్ల
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
మనతెలంగాణ/యాదాద్రిభువనగిరిప్రతినిధి:‘కారు’ పార్టీ బిఆర్ఎస్ కాదని, డిఆర్ఎస్ (దయ్యాల రాష్ట్ర సమితి) అని సిఎం రేవంత్ రెడ్డి సరికొత్త భాష్యం చె ప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గంలోని తిర్మాలపురంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన తనదైన శైలిలో బిఆర్ఎస్, కెసిఆర్, హరీశ్రావుపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. ‘తమ పార్టీలో దయ్యాలు చేరాయని, కెసిఆర్ సొంతింటి బిడ్డనే అం టోంది’ అని అన్నారు. కొరివి దయ్యాలను తరిమికొట్టే బాధ్యత తాను తీసుకుంటానని, అందుకు కార్యకర్తలు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ప్రభు త్వ ఉద్యోగుల కుటుంబాలను ఉద్దేశించి సిఎం మా ట్లాడుతూ..గత పదేళ్లలో ఏ రోజైనా మొదటి తారీఖు న జీతాలు పడ్డాయా అని ప్రశ్నించారు. ‘ప్రభుత్వ ఉ ద్యోగులకు సరైన సమయంలో జీతాలు ఇవ్వకుండా ఇన్స్టాల్మెంట్లలో జీతాలు ఇచ్చినోడు నన్ను ప్రశ్నిస్తా డా?, అని మండిపడ్డారు.
‘బంగారు తెలంగాణ ము సుగులో బొందలగడ్డ తెలంగాణగా మార్చినోళ్లు న న్ను విమర్శిస్తారా’? అని అన్నారు. పదేళ్ల పాలనలో ప్రజలను కల్వకుంట పాలన చేసినోళ్లే కల్వకుంట్ల కు టుంబమోళ్లు. వాసాలమర్రిలో ఆకుల ఆదవ్వకు అల్లనేరేడు పళ్లు ఇచ్చారని, ఆమె ఆస్పత్రిలో పడిందని, కెసిఆర్ దత్తత తీసుకున్న వాసాలమర్రి శ్మశానంగా మార్చారని, పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందన్నట్లు వాసాలమర్రిని కెసిఆర్ నాశ నం చేశారని మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న పు ణ్యక్షేత్రం యాదగిరి గుట్టను యాదాద్రిగా పేరు మా ర్చారని, లక్షల కోట్ల కాంట్రాక్టర్లతో కలిసి దోచుకు తి న్నారని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వ అధికారంలో కి రాగానే మళ్లీ యాదగిరిగుట్టగా పేరు మార్చామని, టిటిడి తరహాలో యాదగిరిగుట్టకు పాలకవర్గం ఏర్పా టు చేస్తున్నామని తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్టలో మెడికల్ కాలేజీ విద్యా సంస్థలను యూనివర్సిటీగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
తాటిచెట్టు అంత ఎదిగి మోకాళ్లలో మెదడు ఉన్న ఒకాయన గంధమల్ల రిజర్వాయర్ గురించి మాట్లాడుతున్నాడుని, రెండు లక్షల కోట్లు ఇరిగేషన్ కోసం కేటాయింస్తే నల్లగొండలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని పరోక్షంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్ఎ హరీశ్రావును ఉద్దేశించి ప్రశ్నించారు. ఎవరు అడ్డం వచ్చినా మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పామని, ఏదేమైనా మూసీ ప్రక్షాళన చేసి చూపిస్తామని సవాల్ విసిరారు. ‘గుజరాత్లో సబర్మతి, యుపిలో గంగా నదిని ప్రక్షాళన చేసుకున్నారు. కానీ మేం.. మా నల్లగొండ బిడ్డలు మూసీ ప్రక్షాళన చేసుకోవద్దా?, మూసీ మురికిలోనే మేం చావాలా? ఇందుకు బిజెపి నేతలు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ‘ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూసీ ఫ్లోరైడ్తో మా ఆడ బిడ్డలకు పుట్టబోయే బిడ్డలు కాళ్లు, కన్నులు వంకరపోతే బిజెపి, బిఆర్ఎస్ నేతలకు కనిపించడం లేదా’? అని ప్రశ్నించారు. ‘మేం మీ ఎర్రవెల్లి, జన్వాడ ఫాంహౌస్ను గుంజుకుంటామని అనలేదు కదా? మూసీ కట్టొద్దనే, ప్రక్షాళన చేయొద్దనే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. పదేళ్లలో ఎస్ఎల్బిసి, గంధమల్ల, పిల్లాయిపల్లి కాల్వలను ఎందుకు పూర్తిచేయలేదని గత ప్రభుత్వ నేతలను సూటిగా ప్రశ్నించారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో మెడికల్ కాలేజీ ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. కెసిఆర్కు ఒక్క నోటీస్ ఇస్తేనే ఆగమాగం అవుతుండని, నెలల తరబడి జైల్లో ఉన్న తనకు ఇంకేం అనిపించాలని రేవంత్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా సభలో ఇందిరమ్మ ఇళ్ళు, మహిళలకు సోలార్ యూనిట్లు వంటి పలు సంక్షేమ పథకాల లబ్ధ్దిదారులకు ఆయా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, గడ్డం ప్రకాష్, భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, స్థానిక ఎంఎల్ఎ బీర్ల ఐలయ్య, ఎంఎల్ఎలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం, రఘువీర్రెడ్డి, ఎంఎల్ఎసి శంకర్ నాయక్, తీన్మార్ మల్లన్న, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డిసిపి నేత ఆకాంక్ష్ యాదవ్, ఆర్డిఒ కృష్ణారెడ్డి, డిఆర్డిఓ నాగిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అందెం సంజీవరెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.