- Advertisement -
మహారాష్ట్ర డిప్యూటీ సిఎం ఏక్నాథ్ షిండేకి (Eknath Shinde) చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు ఓ పైలట్ గంటపాటు చుక్కలు చూపించాడు. షిండే ప్రయాణించాల్సిన విమానాన్ని తాను నడపనంటూ పైలట్ (Pilot) మొండిపట్టు పట్టాడు. ఏక్నాథ్ షిండే, మంత్రి గిరీశ్ మహాజన్, గులాబ్రావ్ పాటిల్లు జలగావ్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పర్యటనకు ఆయన రెండు గంటలు ఆలస్యంగా వచ్చారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి ముంబై వెళ్లేందుకు అక్కడి విమానాశ్రయంకు చేరుకోగా.. తన పని గంటలు ముగిశాయని పైలట్ విమానం నడిపేందుకు అంగీకరించలేదు. దీంతో మంత్రులు విమానాశ్రయ సిబ్బందితో సుమారు 45 నిమిషాలు మాట్లాడి పైలట్ని ఒప్పించారు. దీంతో విమానం అక్కడ నుంచి కదిలింది. పైలట్ ఆరోగ్యం సరిగా లేని కారణంగానే అలా జరిగిందని మంత్రి గిరీశ్ పేర్కొన్నారు.
- Advertisement -