Sunday, June 8, 2025

దేశంలో 5,755కు చేరుకున్న కోవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు 5,755కు చేరుకున్నాయి. గత 24 గంటల్లో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు నుండి ఒక్కొక్కటి చొప్పున మొత్తం నాలుగు కరోనా మరణాలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. దేశ రాజధానిలో ఢిల్లీలో 73 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 665కి చేరుకుంది. రాష్ట్రాలలో, కేరళలో అత్యధికంగా 1,806 యాక్టివ్ కేసులు నమోదు కాగా.. తరువాత గుజరాత్‌లో 717, మహారాష్ట్రలో 577, కర్ణాటకలో 444 పాజిటీవ్ కేసులు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News