Thursday, July 24, 2025

ఛత్తీస్‌గఢ్‌ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్‌: బీజాపూర్‌ జిల్లా నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. గత 3 రోజులుగా నేషనల్‌ పార్క్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటికే మావోయిస్టు కేంద్ర కమిటీతో పాటు తెలంగాణ రాష్ట్ర కీలక సభ్యుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. తాజాగా మరో ఐదుగురు మావోలను భద్రతా బలగాలు హతమార్చాయి. ఘటనాస్థలం నుంచి మృతదేహాలను, ఆయుధాలను బలగాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News