Sunday, June 8, 2025

తొక్కిసలాట ఘటన.. ఇద్దరు కర్ణాటక క్రికెట్ బోర్డు సభ్యులు రాజీనామా

- Advertisement -
- Advertisement -

బెంగళూరులో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) కార్యదర్శి, కోశాధికారి తమ పదవులకు రాజీనామా చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి IPL విజయం సందర్భంగా బుధవారం చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కార్యదర్శి శంకర్, కోశాధికారి ES జైరామ్ రాజీనామా చేశారు.

“గత రెండు రోజులుగా జరిగిన ఊహించని మరియు దురదృష్టకర సంఘటనల కారణంగా.. మా పాత్ర చాలా పరిమితం అయినప్పటికీ నైతిక బాధ్యత వహిస్తూ నిన్న రాత్రి మేము KSCA కార్యదర్శి, కోశాధికారి పదవులకు రాజీనామా చేస్తున్నాం” అని KSCAకి లేఖ రాశారు.

కాగా, తొక్కిసలాట ఘటనలో కర్ణాటక పోలీసులు శుక్రవారం RCB మార్కెటింగ్, రెవెన్యూ హెడ్ నిఖిల్ సోసాలే అరెస్టు చేశారు. నిన్న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్‌కు వెళుతుండగా సోసలేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ DNA సభ్యులు.. సునీల్ మాథ్యూ, కిరణ్, సుమంత్‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన అరెస్టును సవాలు చేస్తూ సోసలే, కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News