Friday, September 12, 2025

బనకచర్లతో ఎలా నష్టం జరుగుతుందో కేంద్రానికి లేఖ రాయాలి.. రేవంత్ కు కిషన్ రెడ్డి సూచన

- Advertisement -
- Advertisement -

ఎపి ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతవారం బనకచర్లపై ఎపి ప్రభుత్వం డిపిఆర్ ఇచ్చిందన్నారు. కేంద్రం ఎపి ప్రభుత్వం ఇచ్చిన డిపిఆర్ ను ఇంకా పరిశీలించలేదన్నారు. గోదావరి జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరగొద్దని.. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ఏవిధంగా నష్టం జరుగుతుందో సిఎం రేవంత్ రెడ్డి, కేంద్రానికి లేఖ రాయాలని కిషన్ రెడ్డి సూచించారు.

మరోవైపు, తెలంగాణ నీటి హక్కుల కోసం రాజీలేని పోరాటానికి తాను సిద్ధంగా ఉన్నానని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, దానికి అడ్డుకుని తీరుతామని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News