Sunday, June 8, 2025

నేడే విస్తరణ?

- Advertisement -
- Advertisement -

మాదిగ, మాల, బిసి సామాజిక వర్గాలకు
బెర్తులు దాదాపు ఖరారు వాకిటి శ్రీహరి,
వివేక్ వెంకటస్వామిలతోపాటు కవ్వంపల్లి
సత్యనారాయణ లేదా అడ్లూరి లక్ష్మణ్‌లలో
ఒకరికి ఛాన్స్ సుదర్శన్‌రెడ్డి కోసం జోరుగా
లాబీయింగ్ గడ్డం ప్రసాద్‌ను కేబినెట్‌లోకి
తీసుకుంటే వివేక్‌కు స్పీకర్ పదవి?
ఆశావహుల్లో ఒకరికి డిప్యూటీ స్పీకర్ పదవి
దక్కే అవకాశం రాజ్‌భవన్‌కు సమాచారం
ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ,
నేడు హైదరాబాద్ రాక విస్తరణలో తమకు
అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌ను
కలిసిన మాదిగ సామాజికవర్గ ఎంఎల్‌ఎలు

మన తెలంగాణ/హైదరాబాద్ : మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకార కార్యక్ర మం జరగనున్నట్లు అధికార పార్టీ వర్గాల్లో ఒక్కసారిగా గుప్పుమంది. మంత్రివర్గంలో తమ వర్గం నుంచి కూడా అవకాశం కల్పించాలని శనివారం సాయంత్రం ఆరుగురు మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు హడావుడిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి తమకు అవకాశం ఇ వ్వాలని కోరడంతో ఈ ప్రచారానికి బలం చేకూరినట్లయింది. అయితే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. గవర్నర్ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఆయన స్పందన కోసం ప్రభుత్వం వేచి చూస్తున్నట్లు అధికార వ ర్గాల సమాచారం. ఇలా ఉండగా ఆదివారం ఉదయం గ వర్నర్ హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు రాజ్‌భవన్ వ ర్గాలు వెల్లడించాయి.

శనివారం రాత్రికి కానీ, ఆదివారం ఉదయం కానీ గవర్నర్ నుంచి అపాయింట్‌మెంట్ లభించిన వెంటనే ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారవుతుందని అధికార పార్టీకి చెందిన కీలక నేత ఒకరు అ భిప్రాయపడ్డారు. మంత్రివర్గ విస్తరణలో ఈసారి ము గ్గురు లేదా నలుగురికి అవకాశం కల్పించేందుకు అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇ చ్చినట్లు అధికార పార్టీ వర్గాల స మాచారం. ప్రస్తుతం మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉం డగా మూడు, లేక నా లుగు పదవులు భర్తీ చేసి రెండింటిని పెండింగ్‌లో పెట్టాల్సిందిగా అధిష్టానం సూచించిన ట్లు సమాచారం. ఈ మే రకు ముగ్గురికి అవకాశం కల్పిం చే పక్షంలో బీసీ, మా దిగ, మాల సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరి చొప్పున అవకాశం దక్కనుంది. వీరిలో బీసీ సామాజిక వర్గం నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మాల సామాజిక వర్గం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, మాదిగ సామాజిక వర్గం నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా

మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ లేక ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పేర్లు దాదాపు ఖరారయినట్లు తెలిసింది. ప్రస్తుతానికి మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇచ్చే అంశంపై ఏకాభిప్రాయం కుదరక పోవడంతో మరి కొంతకాలం పెండింగ్‌లో ఉంచాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ సామాజిక వర్గం నుంచి మొదటి నుంచి మంత్రి వర్గం రేసులో ముందంజలో ఉన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పేరు ఈ జాబితాలో చేర్చే పక్షంలో నలుగురికి స్థానం లభించనుంది. చివరి నిమిషంలో మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్‌రెడ్డి పేరు చేర్చడానికి ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున లాబీయింగ్ జరుగుతున్నట్లు సమాచారం.

ఇదే సామాజిక వర్గం నుంచి మంత్రి పదవులను ఆశిస్తున్న వారిలో నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రితో పాటు నలుగురు ఉండడంతో వీరిలో మరొకరికి అవకాశం దక్కుతుందా ? లేదా ? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే మంత్రి పదవులను ఆశిస్తున్న ముఖ్యుల్లో ఒకరికి డిప్యూటీ స్పీకర్ పదవికి ఒప్పించేందుకు అధిష్టానం పెద్దలు ముఖ్యమంత్రి ద్వారా సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా డిప్యూటీ స్పీకర్ పదవికి వివేక్ వెంకటస్వామిని ప్రతిపాదించగా ఆయన తిరస్కరించినట్లు సమాచారం. దీంతో ఆయనకు స్పీకర్ పదవి ఇచ్చి ఆ స్థానంలో ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్‌ను మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం కూడా లేకపోలేదని అధికార పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News