Sunday, June 8, 2025

తెలంగాణ పోలీస్ తెగువ

- Advertisement -
- Advertisement -

మొత్తం 70మందితో నార్కోటిక్ బ్యూరో ఆపరేషన్ నాలుగు ముఠాల గుట్టురట్టు
50మంది నైజీరియన్లు దందా సాగిస్తున్నట్లు గుర్తింపు ఇద్దరు డ్రగ్స్‌పెడ్లర్ల అరెస్టు
హైదరాబాద్ పబ్‌లలో పని చేస్తున్న ఇద్దరు డిజెలు సహా పలువురి అరెస్టు 40మంది
ప్రముఖులతో సంబంధాలు విదేశాలకు నగదు తరలింపు నిగ్గు తేల్చే పనిలో పోలీసులు

మన తెలంగాణ/హైదరాబాద్: గోవాలో డ్రగ్స్ మాఫియా మూలాలను చేధించే దిశగా తెలంగాణ నార్కొటిక్ బ్యూరో భారీ ఆపరేషన్‌ను నిర్వహిం చింది. మరో మారు తెలంగాణ పోలీసులు తమ ధైర్య సాహసాలను ప్రదర్శించారు. వివిధ కే సులలో నిందితుల నుంచి సేకరించిన వాంగ్మూలం ఆధారం గా తెలంగాణ నార్కొటిక్ బ్యూరో రంగంలోకి దిగింది. వా రం రోజులు పాటు డ్రగ్ మాఫియా అడ్డాలో పాగా వేశారు. వాళ్లకు తెలియకుండానే గ్యాంగ్‌లో కోవర్టు ఆపరేషన్ నిర్వహించారు.గోవాలో ఏకంగా నాలుగు డ్రగ్స్ మాఫియా గ్యాం గులను పట్టుకున్నారు. గోవా కేంద్రంగాహైదరాబాద్‌కి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలను గుర్తించి, ఆ గ్యాంగ్‌లోకి తెలంగాణ పోలీసులు వెళ్లిపోయారు. ఒక్కొక్కరుగా చేరి పోయి కోవర్టు ఆపరేషన్ చేపట్టారు. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో చేసిన కోవర్టు ఆపరేషన్‌కి గోవా పోలీసుల సైతం విస్తుపోయారు. చివరికి తెలంగాణ నార్కోటిక్ పోలీసులకు పూర్తిస్థాయిలో సహకా రం అందించారు. దీంతో అక్కడ నాలుగు డ్ర గ్స్ మాఫియా గ్యాంగులని ఏకకాలంలో తెలంగాణ పోలీసు లు పట్టుకున్నారు. మొత్తం 70 మంది డ్రగ్స్ పెడ్లర్స్ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్స్‌తో పా టు పలువురిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.1.25 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఇందులో రెండు ప్రధానమైన గ్యాంగులు కూడా ఉన్నాయి. రెండు నైజీరియన్ గ్యాంగులతో పాటు హైదరా బాద్ నగరంలో పబ్‌లలో డిజెలుగా పనిచేస్తున్న వనిష్ టక్కర్, స్వదీప్‌లనీ కూడా అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు డిజెలు దాదాపు 40 మంది సంపన్ను లతో కాంటాక్ట్‌లోఉన్నట్టు అధికారులు గుర్తించారు. అయితే ఆ 40 మంది ఎవరు? అనే విషయాన్ని ఇప్పుడు పోలీసులు తేల్చే పనిలో నిమగ్న మయ్యారు. గత కొంత కాలం నుంచి 40 మంది ప్రముఖులకు వీరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని తేలింది. వీళ్లు 40 మంది ప్రముఖుల దగ్గర నుంచి డబ్బులు కూడా పొందినట్లు గూగుల్ పే స్క్రీన్ షాట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి తోడు గోవాలోని సూర్యప్రభ ఫార్మా కంపెనీలో అత్యంత ప్రమాదకరమైన ఆల్ఫాజోలంను తయారు చేసి, తెలంగాణకు సరఫరా చేస్తున్న ముఠాను కూడా అరెస్టు చేశారు. మొత్తం 50 మంది నైజీరియన్లు డ్రగ్స్ దందా సాగిస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. డ్రగ్స్ అమ్మకం ద్వారా వచ్చిన నగదును మనీ లాండరింగ్ రూపంలో విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News