Sunday, June 8, 2025

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవుదినం వెంకన్న సర్వదర్శనం కోసం తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో స్వామివారి సర్వదర్శనానికి భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. ఇక, శనివారం తిరుమల వెంకన్నను 88,257 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 45,068 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.3.68 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News