Sunday, June 8, 2025

మాగంటి గోపీనాథ్‌ మృతిపట్ల కెసిఆర్ దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాగంటి మరణం పార్టీకి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. గోపీనాథ్ కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇక, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా మాగంటి గోపీనాథ్‌ మృతి పట్ల సంతాపం తెలిపారు. తన చిరకాల మిత్రుడిని కోల్పోవడం బాధాకరమని దానం అన్నారు.

కాగా, ఆదివారం తెల్లవారుజామున ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూశారు. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.రెండు రోజుల క్రితం గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న మాగంటి గోపినాథ్ ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఏఐజి ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసియులో ఉంచి డాక్టర్లు చికిత్స అందించారు. అప్పటి నుంచి అబ్సర్వేషన్ లో ఉంచారు. ఈ తెల్లవారుజామున ఆయన చనిపోయినట్లు  డాక్టర్స్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News