Sunday, June 8, 2025

హై యాక్షన్ థ్రిల్లర్‌లో..

- Advertisement -
- Advertisement -

బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ మార్కో విజయం తర్వాత క్యూబ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత షరీఫ్ మహమ్మద్, తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా కట్టలన్‌ను ప్రకటించారు. ఇది పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న హై- యాక్షన్ థ్రిల్లర్.(High-action thriller)ప్రముఖ నటుడు ఆంటోనీ వర్గీస్ (పేపే) హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు పౌల్ జార్జ్. ఈ చిత్రంలో కీలక పాత్రలో సునీల్ నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సునీల్ స్టయిలీష్ లుక్‌లో కనిపిస్తున్న అనౌన్స్ మెంట్ పోస్టర్ అదిరిపోయింది. ఈ మూవీకి కాంతార 2 ఫేం (Kantara 2 fame)అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సంచలనంగా మారింది. వర్షంలో తడిచిన పేపే, చుట్టూ పడి ఉన్న మృతదేహాలు, ఏనుగు దంతాల మధ్య నిలబడి వుండటం కథలో ఉండబోయే వయోలెన్స్ సూచిస్తోంది. మార్కో స్థాయిని మించి ఉండబోతోందని సంకేతాలు ఇస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News