తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక పాత్ర పోషించారు. బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేందుకు ఆయన చేసిన కృషి ఫలితంగా బిసి నుంచి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఎస్సి నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు వివేక్, అడ్లూరి లక్ష్మణ్ లకు మంత్రివర్గంలో చోెటు దక్కింది. ఎస్టీ వర్గానికి చెందిన రామచంద్రు నాయక్ కి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా అవకాశం లభించింది. మహేష్ కుమార్ గౌడ్ చేసిన ముఖ్య సూచనలను కాంగ్రెస్ అధిష్టానం పరిగణనలోకి తీసుకుని, సామాజిక న్యాయానికి మద్దతుగా నిర్ణయం తీసుకుంది. బిసి, ఎస్సి, ఎస్టి వర్గాల నాయకులకు మంత్రి పదవులు ఇవ్వాలన్న దిశగా పార్టీ హైకమాండ్ను ఒప్పించడంలో మహేష్ సఫలమైన తీరు ప్రశంసనీయం. సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరగాలన్న దృఢ సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారు. కాంగ్రెసు పార్టీ సామాజిక సమతుల్యతకు కట్టుబడి పనిచేస్తున్నదన్న విషయాన్ని ఈ నిర్ణయం మరోసారి రుజువు చేసింది.
మంత్రివర్గ విస్తరణలో టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కీలక పాత్ర
- Advertisement -
- Advertisement -
- Advertisement -