Sunday, June 8, 2025

ఈ విత్తనాలు తీసుకుంటే బరువు ఇట్టే తగ్గుతారు..

- Advertisement -
- Advertisement -

చాలామంది బరువు తగ్గాలని కోరుకుంటారు. దీనికోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలం అవుతుంటారు. ఒకవేళ మీరు బరువు తగ్గాలనుకుంటే కొన్ని విత్తనాలను ఆహారంలో చేర్చుకుంటే సరిపోతుంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇప్పుడు బరువు తగ్గడంలో సహాయపడే కొన్ని విత్తనాల గురించి తెలుసుకుందాం.

చియా గింజలు సైజులో చిన్నగా ఉన్నా కానీ దాన్ని తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. ఈ గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆహారాన్ని తక్కువ తీసుకోవడానికి ఉపయోగపడతాయి.

అవిసె గింజలు కొవ్వును కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో లిగ్నాన్లు, ఫైబర్‌ నిండి ఉంటాయి. దీంతో ఇవి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. వీటి వినియోగం ఆకలిని కూడా తగ్గిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి.

సోంపు గింజలును మౌత్ ప్రెషర్ గా ఉపయోగిస్తాము. కానీ వీటిని తీసుకుంటే అనేక లాభాలు ఉంటాయి. సోంపు గింజలు జీర్ణక్రియ, ఆకలిని కూడా అణిచివేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఇవి జీవక్రియను పెంచుతాయి. బరువు తగ్గడానికి కూడా ఎంతో సహాయపడతాయి.

గుమ్మడికాయ గింజల్లో ప్రోటీన్, మెగ్నీషియం, ఐరన్ అధికంగా నిండి ఉంటాయి. ఇవి శరీర కొవ్వును బాగా కరిగించడానికి ఉపయోగపడతాయి.

నువ్వులు శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్ బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడతాయి. వీటి వినియోగం ఇట్టే కొవ్వును కరిగిస్తాయి.

 

నోట్ : పైన సేకరించిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పబ్లిష్ చేస్తున్నాము. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News