Sunday, June 8, 2025

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. ముగ్గురు కొత్త మంత్రుల ప్రమాణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్తగా ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రమాణస్వీకారం చేసిన ముగ్గురు మంత్రులకు సిఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ సాయంత్రం ముగ్గురు మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. కాగా.. పదవులు ఆశించిన పలువురు సీనియర్ నాయకులను అధిష్టానం బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News