Sunday, June 8, 2025

దత్తాత్రేయది ఆదర్శ రాజకీయ జీవితం: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) ను దత్తన్న అని అభిమానంగా పిలుచుకుంటారని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. జెంటిల్ మెన్ కు ప్రతిరూపం బండారు దత్తాత్రేయ అని సిఎం కొనియాడారు. హైదరాబాద్ లో ‘ ప్రజల కథే నా ఆత్మకథ’ బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సాధారణ కార్యకర్త నుంచి జాతీయ నేతగా ఎదిగారని, ఎన్నో పోరాటాలు చేశారని, ఉద్యమాలు, సంఘర్షణలు ఎదుర్కొన్నారని అన్నారు. దత్తాత్రేయ కోరుకుంది జనహితం.. ఆయనది లౌకికవాదం అని చెప్పారు. బండారు దత్తాత్రేయ పాటించేది మత సామరస్యం అని అలయ్ బలయ్ పేరుతో అన్నివర్గాలను ఏకతాటిపైకి తెచ్చారని ప్రసంసించారు. అందరినీ కలిపేందుకు దత్తాత్రేయ వేదిక రూపొందించారని, బండారు దత్తాత్రేయకు విరోధులు ఎవరూ ఉండరని అన్నారు.

దత్తాత్రేయకు ఏ రాజకీయ పార్టీ అనే వ్యత్యాసం ఉండదని, దత్తాత్రేయది ఆదర్శ రాజకీయ జీవితమని తెలియజేశారు. ప్రజాసమస్యలపై (public issues) ప్రభుత్వాలకు, సిఎంలకు లేఖలు రాశారని, లేఖలు రాయడంలో దత్తాత్రేయ అంబాసిడర్ గా నిలిచారని పేర్కొన్నారు. హేమాహేమీలతో ప్రయాణించడం అరుదైన అనుభవమని, హైదరాబాద్ అభివృద్ధి కోసం అనునిత్యం పనిచేశారని అన్నారు. ఉత్తర, దక్షిణ భారత్ ప్రజలతో దత్తాత్రేయ మమేకమయ్యారని, భారత్ నంబర్ వన్ గా అయ్యే రోజులు తొందర్లోనే ఉన్నాయని జోస్యం చెప్పారు. తెలుగుజాతి అగ్రస్థానంలో ఉండేందుకు దీక్ష తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News