Wednesday, June 18, 2025

ఇంతమంది గవర్నర్లను ఒకే వేదికపై చూడటం అరుదు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆర్ఎస్ఎస్ స్కూల్ లో చదివానని.. కాలేజీ ఎపి సిఎం చంద్రబాబు నాయుడు దగ్గర చేశానని తెలిపారు. ఉద్యోగం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నానని అన్నారు. హైదరాబాద్ లో ‘ప్రజల కథే నా ఆత్మకథ’ బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ పుస్తకావిష్కరణ (autobiography book launch) కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలతో అనుబంధాన్ని ఆత్మకథ పుస్తకంలో దత్తాత్రేయ పంచుకున్నారని చెప్పారు. పదవులున్నా లేకున్నా వాజ్ పేయిూ, దత్తాత్రేయకు గౌరవం తగ్గలేదని ఆనందాన్ని వ్యక్తం చేశారు. దత్తాత్రేయ ఏ రోజు ప్రజలతో సంబంధాలు కోల్పోలేదని, ఇంతమంది గవర్నర్లను ఒకే వేదికపై చూడటం అరుదని అన్నారు. పేదలకు కష్టాలుంటే గుర్తేచ్చే నేతలు పిజెఆర్, దత్తాత్రేయ అని తెలియజేశారు. గౌలిగూడ గల్లీ నుంచి హరియాణా గవర్నర్ గా దత్తాత్రేయ ఎదిగారని ప్రశంసించారు. దత్తాత్రేయ, బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News