Monday, June 9, 2025

తన సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి హీరో కొత్త ప్రయత్నం

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) తాజాగా నటించిన చిత్రం ‘హౌస్‌ఫుల్-5’ (Housefull 5). పూర్తిస్థాయిలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించుకుంది. అయితే అక్షయ్ కుమార్ ఈ సినిమాని ప్రమోట్ చేయడం కోసం కొత్త అవతారం ఎత్తారు. సినిమా గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకొనేందుకు స్వయంగా ఆయనే ముంబైలోని ఓ థియేటర్ వద్దకు మాస్క్ ధరించి వెళ్లారు. సినిమా చూసి బయటకు వస్తున్న ప్రేక్షకులను ఆపి మరీ రివ్యూ అడిగారు. ఇందుకు సంబంధించిన వీడియోని అక్షయ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

‘‘హౌస్‌ఫుల్-5’ (Housefull 5) చూసిన వారి నుంచి రివ్యూ తెలుసుకొనేందుకు ఈ కిల్లర్ మాస్కులు ధరించి బాంద్రాలోని థియేటర్ వద్దకు చేరుకున్నాం. వాళ్లు నన్ను గుర్తుపట్టేలోపే అక్కడి నుంచి పారిపోయాం. అద్భుతమైన అనుభవం’’ అంటూ అక్షయ్ ఆ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ఇక సినిమా విషయానికొస్తే.. అక్షయ్‌తో(Akshay Kumar) పాటు ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్, రితేశ్ దేశ్‌ముఖ్ హీరోలుగా నటించారు. జాక్వలిన్ ఫెర్నాండేజ్, సోనమ్ బాజ్వా, నర్గీస్ ఫక్రీ హీరోయిన్లుగా చేయగా.. సంజయ్ దత్, జాకీ ష్రాఫ్‌లు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News