మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు సోమవారం నాడు కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ముందు హాజరై వాగ్మూలం ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిల నిర్మాణాలపై కమిషన్ గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ఈటల రాజేందర్, హరీష్ రావులతో పాటు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 5వ తేదీన మాజీ సిఎం కెసిఆర్ హాజరుకావాల్సి ఉండగా, వాయిదాను కోరుతూ తాను ఈనెల 11వ
తేదీన కమిషన్ ముందు హాజరవుతారని కమిషన్కు తెలియజేశారు. మాజీ ఆర్ధిక శాఖ మంత్రి, ప్రస్తుత బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ ఈనెల 6వ తేదీన కమిషన్ ముందు హాజరయ్యారు. జస్టిస్ పి.సి ఘోష్ అడిగిన ప్రశ్నలకు ఈటల రాజేందర్ సమాధానాలు ఇచ్చారు. దాదాపు ఇరవై నిమిషాల పాటు ఈటల రాజేందర్ను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఆతర్వాత తాను క్రాస్ ఎగ్జామినల్లో ఇచ్చిన వాగ్మూలాన్ని ధృవీకరిస్తూ నోట్స్పై సంతకాలు చేసి వెళ్ళిపోయారు. ఈనెల 11వ తేదీ బుధవారం నాడు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ జస్టిస్ పిసి ఘోష్ విచారణకు హాజరుకానున్నారు.