Monday, June 9, 2025

భారత్‌కు మరో నాలుగు స్వర్ణాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత అథ్లెట్లు తైవాన్ (Athletes Taiwan) ఓపెన్‌లో అదరగొట్టారు. చివరి రోజైన ఆదివారం పతకాల పంట పండించారు. దీంతో మరో నాలుగు బంగారు పతకాలు భారత్ ఖాతాలో వచ్చిచేరాయి. మూడుసార్లు జాతీయ ఛాంపియన్ విథ్యా రామరాజ్, రోహిత్ యాదవ్, పూజా, క్రిష్ణ కుమార్‌లు పసిడి పతకాలను ఒడిసిపట్టారు. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో (hurdles final) యశాస్ పలాక్ష వెండి పతకం సాధించాడు. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో విథ్యా చిరుత పులిలా పరుగెత్తి స్వర్ణం పతకం చేజిక్కిచ్చుకుంది. ఫైనల్లో ఆమె 56.53 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుని పతకం సాధించింది. అయితే త్వరలో జరుగబోయే వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో ర్యాంకింగ్స్ మెరుగవ్వనుంది.

ఇక జావెలిన్ త్రోలో రోహిత్ 74.42 మీటర్ల దూరం ఈటెను విసిరి బంగారు పతకం సాధించాడు. మహిళల, పురుషుల 800 మీటర్ల పరుగులో భారత అథ్లెట్లు అద్బుతం చేశారు. అంచనాలను అందుకుంటూ పూజ భారత్‌కే చెందిన ట్వింకిల్ చౌదరీని వెనక్కు నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 2.02 79 సెకన్లలో ఫినిషింగ్ లైన్ దాటింది. దీంతో ట్వింకిల్ రెండో స్థానానికి పరిమితమయ్యింది. పురుషుల ఫైనల్లో క్రిష్ణ కుమార్ ప్రత్యర్థులకు షాకిస్తూ 1.48 46 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకొని బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా, శనివారం జరిగిన పోటీల్లో జ్యోతి ఎర్రాజీ, అబ్దుల్లా, పూజలు స్వర్ణాలతో మెరిసిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News