- Advertisement -
రైలులో నుంచి జారీ పడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం ముంబయి లోకల్ ట్రైన్ లో చోటుచేసుకుంది. సోమవారం ముంబయి లోకల్ ట్రైన్లో ప్రయాణికులు కిక్కిరిసిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ముంబైలో రద్దీగా ఉన్న లోకల్ రైలు నుండి పడి ఐదుగురు ప్రయాణికులు మరణించారని రైల్వే అధికారులు తెలిపారు. పుష్పక్ ఎక్స్ప్రెస్, కసారా లోకల్ ఒకదానికొకటి దాటుతున్న సమయంలో ముంబ్రా-దివా రైల్వే స్టేషన్ల మధ్య ఈ సంఘటన జరిగింది. రద్దీ కారణంగా పలువురు ప్రయాణికులు జారీ పట్టాలపై పడటంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరికొంత మందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -