అమరావతి: కూటమి ప్రభుత్వం వైఫల్యం దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉందని వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) మండిపడ్డారు. మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. జగన్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్య చేశారని, తమ కుమార్తె కనిపించడం లేదని ఈ నెల 3 న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ అమ్మాయిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యార్థిని హత్య ఘటనే అందుకు నిదర్శనం అని అన్నారు. 6 రోజుల క్రితం ఫిర్యాదు వచ్చినా కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? అని ప్రశ్నించారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, డైవర్షన్ పాలిటిక్స్ (Diversion Politics) తప్ప.. ఈ ప్రభుత్వానికి ప్రజల రక్షణ పట్ల బాధ్యత ఉందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం ఘటనకు సిఎం బాధ్యత వహించాలని జగన్ సూచించారు.
ఈ ప్రభుత్వానికి ప్రజల రక్షణ పట్ల బాధ్యత ఉందా?: జగన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -