- Advertisement -
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుండారం నుండి కామారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి టీవీఎస్ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమచాారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. బస్సు కింద చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను దోమకొండకు చెందిన నడిపి సిద్ధిరాములు(50), మనుమడు శ్రీహాస్ (04)లుగా గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -