మనతెలంగాణ, సిటీబ్యూరో: ప్రజావాణిలో వచ్చిన విన్నపాలను బాధ్యతతో సత్వరమే పరిష్కరించాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయలో సోమవారం జరిగిన ప్రజావాణిలో నగరం నలు వైపుల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కమిషనర్కు విన్నవించారు. ప్రజలు విన్న వుంచిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వర పరిష్కారానికి సంభందిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… గ్రేటర్ వ్యాప్తంగా తమ సమస్యలను తెలియజేయడాని, విన్నపం అందజేసిన నేపథ్యంలో అధికారులు కూడా వారి విన్నవించిన సమస్యను బాధ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలు పరిష్కారంలో సంబంధిత హెచ్ఓడి లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. జిహెచ్ఎం సి వ్యాప్తంగా మొత్తం147 దరఖాస్తులు రాగా అందులో టెలిఫోన్ ద్వారా 4, మిగతావి జోనల్ నుండి 78 విన్నపాలు వచ్చాయి. చార్మినార్ జోన్ నుండి 2, ఎల్ బి నగర్ 11, సికింద్రాబాద్ లో 16, కూకట్ పల్లి 27, శేరిలింగం పల్లి 22 , రాగా జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ లో 65 విన్నపాలు వచ్చాయి.
అందులో ఇంజనీరింగ్ 3 విన్నపాలు, టౌన్ ప్లానింగ్ 28 , హెల్త్ 3, శానిటేషన్ 5, విజిలెన్స్ 2, ఫైనాన్స్ 1, భూసేకరణ2, హౌసింగ్, యు.బి.డి, , యుసిడి లీగల్, ఎస్టేట్ వెటర్నరీ విభాగాలకు ఒక్కొక్క విన్నపాలు వచ్చాయి. ఈ ప్రజావాణిలో కమిషనర్ తో పాటుగా అడిషనల్ కమీషనర్ స్నేహ శబరుష్, వేణుగోపాల్, రఘు ప్రసాద్, సి సి పి శ్రీనివాస్, వేణుగోపాల్ రెడ్డి, నళిని పద్మావతి, పంకజ, గీతా రాధిక, సత్యనారాయణ, సామ్రాట్ అశోక్, చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ పద్మజ, చీఫ్ వెటర్నరీ అధికారి డాక్టర్ అబ్దుల్ వకీల్, ఉమా ప్రకాశ్, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్, అడిషనల్ సి సి పి లు గంగాధర్, వెంకన్న, ప్రదీప్ కుమార్, డిప్యూటీ సి ఈ పనస రెడ్డి, ఎస్ ఎన్ డి పి ఎస్ ఈ పి.వి రెడ్డి, ఏ ఈ బాలాజీ, హౌసింగ్ ఈ ఈ రాజేశ్వర రావు, కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు తమ సమస్యలను ఆన్ లైన్ ద్వారా కూడా విన్నవించవచ్చు.
నగర ప్రజలు తమ సమస్యలను ఎపుడైనా జిహెచ్ఎంసి యాప్ ద్వారా విన్నవించ వచ్చని కమిషనర్ ఆర్వి కర్ణన్ అన్నారు. జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్లో సోమవారం జరిగిన ప్రజావాణి సందర్భంగా గోపనపల్లి డైమండ్ హేట్స్ కాలానికి సంబంధించిన కొందరు మా కాలనీ రోడ్డు బాగాలేదని కాలనీలో నివాసితులు వాట్సప్ గ్రూప్ లో పోస్టు చేసిన నేపథ్యంలో ఆన్ లైన్ లో జిహెచ్ఎంసి కి ఫిర్యాదు చేయవద్దని పోస్ట్ చేస్తున్నారని కాలనీకి సంబంధించిన కొందరు వ్యక్తులు కమిషనర్ దృష్టి కి తీసుకొని రాగా నగర ప్రజలు తమ సమస్యలను భౌతికంగానే కాకుండా ఆన్ లైన్ కూడా తము విన్నపాలను తెలియజేయవచ్చని వారికి కమీషనర్ పేర్కొన్నారు.