Wednesday, June 11, 2025

పని తీరే కొలమానం

- Advertisement -
- Advertisement -

మంత్రుల శాఖల కేటాయింపుపై
హస్తినలో కసరత్తు గ్రేడింగ్
పద్ధతిలో మంత్రుల పనితీరు
నిర్ధారణ సమర్థ్ధత ప్రాతిపదికగా
మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు
ఆ మేరకు ఎఐసిసి నేత కెసి
వేణుగోపాల్‌కు సిఎం నివేదిక?
ఢిల్లీలో వేణుగోపాల్‌తో గంట
పాటు సమావేశం నేడు
ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో సిఎం
భేటీ ఆ తరువాతే మంత్రులకు
శాఖల కేటాయింపుపై ప్రకటన
భట్టికి హోం, శ్రీధర్‌బాబుకు ఆర్థికం
వాకిటికి మున్సిపల్, అడ్లూరికి
సంక్షేమం, వివేక్‌కు విద్యాశాఖ?

మన తెలంగాణ/హైదరాబాద్: కొత్త మంత్రులు ప్రమాణ స్వీ కారం పూర్తి కావడంతో వారికి ఏయే శాఖలు కేటాయిస్తారన్న వి షయమై ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాశంగా మారింది. సిఎం వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తారా లేక మొత్తం మంత్రుల దగ్గర ఉన్న శాఖలను ప్రక్షాళన చేస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలోనే సోమవారం సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సిఎం రేవంత్‌రెడ్డి కెసి వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. మంత్రుల శాఖల పునర్ వ్యవస్థీకరణతో పా టు కార్పొరేషన్ పదవులు, పిసిసి కార్యవర్గం తదితర అంశాలపై ఆయనతో సిఎం చర్చించారు. చీఫ్ విప్ పదవితో పాటు రెండు విప్ పదవులు, మరో మూడు మంత్రి పదవుల భర్తీ గురించి కెసి వేణుగోపాల్‌తో సిఎం రేవంత్‌రెడ్డి చర్చించినట్టుగా సమాచారం.

సుమారు గంటపాటు కెసితో సిఎం రేవంత్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ, బిసి కులగణనలకు సంబంధించి రాష్ట్రంలో రెండు సభలను నిర్వహించాలని నిర్ణయించినట్టుగా సిఎం రేవంత్ కెసి వేణుగోపాల్‌తో పేర్కొన్నట్టుగా తెలిసింది. ఈ సభలకు ఏఐసిసి అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, సోనియాగాంధీల అపాయింట్‌మెంట్ ఇప్పించాలని, ఈ సభలకు అగ్రనేతలు వచ్చేలా ఒప్పించాలని సిఎం రేవంత్ కెసి వేణుగోపాల్‌కు విజ్ఞప్తి చేసినట్టుగా సమాచారం. అయితే ఏఐసిసి మల్లికార్జున ఖర్గేను సిఎం రేవంత్ నేడు కలిసే అవకాశం ఉందని తెలిసింది.

గ్రేడింగ్ ఆధారంగా శాఖల కేటాయింపు..?
మంత్రులకు శాఖల కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివేదికతో ఢిల్లీకి చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల వద్ద కొంత మందికి రెండు మూడు శాఖలు ఉన్నాయి. వీరిలో ఎవరెవరూ సమర్థవంతంగా పని చేస్తున్నారు, ఎవరెవరూ నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నా రన్న పూర్తి వివరాలతో ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు సీనియర్ మంత్రులకు సంబంధించి శాఖల్లో మార్పు ఉండబోతున్నట్లుగా చర్చ జరుగుతోంది. దీంతోపాటు 16 నెలల కాలంలో మంత్రుల పనితీరు ఆధారంగా కేటాయించిన గ్రేడింగ్‌ను కూడా ఏఐసిసి నాయకులు కెసి వేణుగోపాల్‌కు సిఎం రేవంత్ అందచేసినట్టుగా తెలిసింది.

భట్టికి హోంశాఖ…శ్రీధర్ బాబుకు ఆర్థికం?
ముఖ్యంగా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు హోంశాఖను కేటాయించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ, వాకిటి శ్రీహరికి మున్సిపల్ శాఖ, అడ్లూరికి ఎస్సీ సంక్షేమం, వివేక్‌కు విద్యా శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఆర్థిక, పౌరసరఫరాల శాఖల మార్పు గురించి కూడా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. శ్రీధర్ బాబుకు ఐటీతో పాటు ఇతర శాఖలు కేటాయించనున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సిఎం రేవంత్ రెడ్డి వద్ద సాధారణ పరిపాలన శాఖతో పాటు హోం శాఖ, విద్య, మున్సిపల్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశుసంవర్ధక, మైనింగ్ తదితర శాఖలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ఇతర మంత్రులకు కేటాయించే యోచనలో సిఎం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News