Tuesday, June 10, 2025

శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్ర రేపటికి వాయిదా

- Advertisement -
- Advertisement -

సాయంత్రం 5.30గంటలకు
స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌లో
అంతరిక్ష కేంద్రానికి
41ఏళ్ల తరువాత భారతీయుడి
రోదసీ యాత్ర

న్యూఢిల్లీ : భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్ర వాయిదా పడింది. అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ యాక్సియం చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ఎఎక్స్4 మిషన్ 11వ తేదీకి వాయిదా పడింది. అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారంనాడు సాయంత్రం 5.30గంటలకు నింగిలోకి దూసుకెళ్తుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించింది. మంగళవారం సాయంత్రం 5.52గంటలకు జరగాల్సిన ఈ ప్ర యోగం వాతావర ణం అనుకూలించని కారణంగా బుధవారానికి వాయిదా ప డ్డట్లు ఇస్రో తెలిపిం ది.స్పేస్‌ఎక్స్ ఫా ల్కన్ 9 రాకెట్ ద్వా రా శుభాన్షు అంతర్జాతీయ అంతరిక్ష కేం ద్రానికి(ఐఎస్‌ఎస్) వెళ్లనున్నారు. తద్వారా 41 ఏళ్ల తర్వాత రోదసీ యాత్ర చేయనున్న రెం డో భారతీయుడిగా రికార్డు సృష్టించనున్నారు. ఇంతకు ముందు రాకేశ్ శర్మ , రష్యా సహకారంతో అంతరిక్షయా నం చేసిన సంగతి తెలిసిందే. రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లి 8 రోజులుండి తిరిగి వచ్చారు. రాకేశ్ శర్మను శుభా న్షు తన స్ఫూర్తి ప్రదాతగా భావిస్తుంటారు.

శుభాన్షుతోపాటు పోలండ్, హంగరీకి చెందిన కమాండర్ పెగ్గీ విట్స న్, మిషనల్ స్పెషలిస్టులు టివోర్ కఫూ, స్లావోజ్ ఉజ్‌నాన్‌స్కీవిస్నీవెక్సీ బయలుదేరుతున్నారు. ఈ మిషన్‌కు శుభా న్షు శుక్లా పైలట్‌గా వ్యవహరింబోతున్నారు. నాసా సహకారంతో ఐఎస్‌ఎస్‌లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. అంతరిక్ష కేంద్రం లో కనీసం రెండు వారాల పాటు ఉంటారు. తిరిగి ఎప్పు డు వచ్చేది ఇంకా షెడ్యూల్ నిర్ణయం కాలేదు. అంతరిక్ష కేంద్రంలో వివిధ ప్రపంచ సంస్థల నుంచి దాదాపు 60 వివిధ అంతరిక్ష పరిశోధనప్రయోగాలు చేయనున్నారు.యాక్సియమ్ స్పేస్ సంస్థ సహకారంతో ఇస్రో ఈ ప్రయోగానికి రూ. 550 కోట్లు ఖర్చు పెడుతోంది. భారత్‌కు సంబంధించి ఎనిమిది ప్రయోగాలను శుక్లా చేపట్టనున్నారు. నిజానికి మే 29 నే ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా వాయిదా పడింది. తొలుత ఈ ప్రయోగాన్ని జూన్ 8 వ తేదీకి వాయిదా వేశారు. ఆ తర్వాత ఈ ప్రయోగం బుధవారానికి వాయిదా పడింది. ప్రయోగానికి ముందు సన్నాహాల్లో చిన్న సాంకేతిక సమస్యను గుర్తించడంతో మిషన్‌ను వాయిదా వేసినట్టు యాక్సియమ్ స్పేస్, నాసా సంయుక్తంగా ప్రకటించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News