సంచలన ప్రకటన రెండు
రోజుల్లో అన్ని వివరాలు వెల్లడిస్తానని స్పష్టీకరణ మంత్రుల
శాఖల కేటాయింపుపై చర్చకు ఢిల్లీకి రాలేదు నేను అధికారంలో
ఉన్నంత వరకు కెసిఆర్ కుటుంబానికి కాంగ్రెస్లోకి నో ఎంట్రీ
కవిత కొత్త పార్టీ పెట్టుకుంటుందేమో.. కాంగ్రెస్లో ఎందుకు
చేరుతుంది? కేంద్ర మంత్రిగా కిషన్రెడ్డి విఫలమయ్యారు
రాష్ట్రానికి ఆయన ఒక్క ప్రాజెక్టు తేలేదు ఢిల్లీలో విలేకరులతో
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిట్చాట్
మన తెలంగాణ/హైదరాబాద్: మంత్రుల శాఖల కేటాయింపు గురించి తాను ఢిల్లీకి రాలేదని, ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుపై ఢిల్లీలో అధిష్ఠానంతో దాని గురించి ఎ లాంటి చర్చ జరగలేదని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. రెండు రోజుల్లో మీడియా సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వాస్తవాలను ప్రజల ముందుంచుతానని సిఎం తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక డాక్యుమెంట్లు బయటపెడతానని ఆయన సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో విజయవంతంగా పూర్తి చేసిన కుల గణనపై తాము పాటించిన విధానాన్ని కర్ణాటకకు తెలియజేయడానికి తాను ఢిల్లీకి వచ్చినట్టు వివరించారు. తనతో పాటు కర్ణాటక సిఎం, ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే, కెసి వేణుగోపాల్, రాహుల్గాంధీలతో సమావేశమయ్యామని ఆయన పేర్కొన్నారు. కులగణనలో కులజనాభా లెక్కింపు ఒక అంశం మాత్రమేనని, వాస్తవానికి కులగణన అ న్నది సామాజిక
, ఆర్ధిక, విద్య, రాజకీయ సర్వే అ ని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల్లో తాము చే సిన కులగణన ప్రకార మే 42శాతంబిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కాంగ్రెస్ అవకాశం ఇస్తుంద ని సిఎం చెప్పారు. తన దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు ఇస్తానని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్కు వెళ్లగానే అందరితో సంప్రదించి కొత్త మంత్రుల శాఖలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పనిభారం ఎక్కువైందని ఏ మంత్రి అయినా చెబితే అప్పుడు ఆలోచిస్తానన్నారు. మం త్రుల శాఖల మార్పులు, చేర్పులపై తాను ఒక్కడినే అధిష్ఠానంతో చర్చించి నిర్ణయం తీసుకోలేనన్నారు. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢి ల్లీలో విలేకరులతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ తాను అ ధికారంలో ఉన్నంతవరకు కెసిఆర్ కుటుంబానికి కాంగ్రెస్లోకి ఎంట్రీ లేదని, రానివ్వనని రేవంత్ రెడ్డి అన్నారు.
కెసిఆర్
కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులని ఆయన పేర్కొన్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు, జనాల్లో చర్చ జరిగేందుకే కెసిఆర్కు ఎమ్మెల్సీ కవిత లేఖ అంటూ హడావుడి చేశారన్నారు. కవిత చేసిందంతా ‘అసెంబ్లీ రౌడీ’ సినిమా తరహా డ్రామా అని ఆయన విమర్శించారు. కెసిఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని చెప్పిన కవిత మళ్లీ ఆ గ్రూప్తో ఎలా కలిసిందని సిఎం రేవంత్ ప్రశ్నించారు. దెయ్యాలున్నాయని చెప్పి ఆ గ్రూప్తోనే కమిషన్ విచారణకు పోయిందని ముఖ్యమంత్రి విమర్శించారు. దెయ్యాల్లో ఆమె కూడా భాగం అయిందా? అని అన్నారు. వాళ్లందరూ ఒక్కటేనని, వాళ్లను ఎవరూ పట్టించుకోవడం లేదని, అందరూ కలిసి కొత్త చర్చకు తెరలేపారని సిఎం రేవంత్ అన్నారు. కవిత కాంగ్రెస్లో చేరుతుందన్న ఊహాగానాలను సిఎం రేవంత్ కొట్టిపారేశారు. కవిత కొత్త పార్టీ పెట్టుకుంటుందేమోనని, కాంగ్రెస్లో ఆమె ఎందుకు చేరుతుందని ఆయన ప్రశ్నించారు.
కెటిఆర్ చెప్పినట్టు కిషన్రెడ్డి వింటారు…
తెలంగాణకు కేంద్రం నుంచి మంజూరు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఒక్కరోజు కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించలేదని ఆయన మండిపడ్డారు. రీజనల్ రింగ్రోడ్డు సహా అనేక ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సిఎం రేవంత్ ఆరోపించారు. కెటిఆర్ చెప్పినట్టు కిషన్ రెడ్డి నడుచుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ భూసేకరణను తానే క్లియర్ చేశానని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కెసిఆర్, కెటిఆర్, హరీశ్రావు, కిషన్రెడ్డిలు ఒక్కటేనని సిఎం రేవంత్ ఆరోపించారు. మెట్రో విస్తరణ కెటిఆర్కు ఇష్టం లేదని, అందుకే కిషన్రెడ్డి అడ్డుకుంటు న్నారని సిఎం రేవంత్ ధ్వజమెత్తారు. కేంద్రమంత్రిగా కిషన్రెడ్డి ఫెయిల్ అయ్యారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు.
మానవజాతి మనుగడ సాగించినంత వరకు నక్సలిజం ఉంటుంది
సమాజంలో అంతరాలు ఉన్నంతకాలం నక్సలిజం ఉంటుందని, నక్సలిజం రూపాంతరం చెందుతుందని, కానీ, పూర్తిగా అంతరించదని, అంతరించే అవకాశమే ఉండదని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. మానవజాతి మనుగడ సాగించినంత వరకు నక్సలిజం కూడా మనుగడ సాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల్లో మీడియా సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వాస్తవాలను ప్రజల ముందుంచుతానని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక డాక్యుమెంట్లు బయటపెడతానని ఆయన చెప్పారు.
మా ఇంట్లో నేను తప్పా ఎవరూ క్రియాశీలక రాజకీయాల్లో లేరు
రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వారికే పదవులు, బాధ్యతలు దక్కుతాయని సిఎం రేవంత్ తెలిపారు. మా ఇంట్లో తాను మినహాయించి ఎవరూ రాజకీయాల్లో క్రియాశీలంగా లేరన్నారు. నా సోద రులంతా వాళ్ల వాళ్ల బిజనెస్లు చేసుకుంటున్నారన్నారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపిన సిఎం రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం తిరిగి హైదరాబాద్కు వచ్చారు.