న్యూఢిల్లీ: రైల్వే తత్కాల్ టికెట్ల బుకింగ్కు సంబంధించి కేంద్రం కొత్త నిబంధనను తీసుకు వచ్చింది. కేవలం ఆధార్ ధ్రువీకరణ ఉన్న వ్యక్తులు మాత్రమే జులై 1నుంచి తత్కాల్ బుక్ చేసుకునేందుకు అవకా శం కల్పించినట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ మేరకు అన్ని జోన్లకు తాజాగా సర్కులర్ జారీ చేసింది. ‘ ఐఆర్సిటిసి వెబ్సైట్ / యాప్లో ఆధార్ అథంటికేటెడ్ వ్యక్తులకే టికెట్ బుకింగ్ అవకాశం క ల్పించాలి’ అని ఆ సర్కులర్లో రైల్వే శాఖ స్పష్టం చేసింది. అలాగే జు లై 15నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్కు ఆధార్ బేస్డ్ ఒటిపికూడా తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. రైల్వే శాఖకు చెందిన టికెట్ బు కింగ్ కౌంటర్లు, అధీకృత ఏజెంట్లు తత్కాల్ టికెట్లు బుక్ చేయాలంటే వ్య క్తుల మొబైల్కు వచ్చే ఆధార్ ఒటిపిని ఎంటర్ చేయాల్సి ఉంటుందని తన సర్కులర్లో తెలిపింది.
దీంతో పాటు అధీకృత ఏజెంట్లకు తత్కాల్ టికెట్ల బుకింగ్కు తొలి 30 నిమిషాల పాటు అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేసింది. అంటే ఏసీ తరగతులకు ఉదయం 10.30 గంటల త ర్వాత, నాన్ ఏసీ తరగతులకు ఉదయం 11.30 గంటల తర్వాత మా త్రమే టికెట్ బుకింగ్కు వెసులుబాటు కల్పించనున్నారు. అనధికారిక టికెట్ బుకింగ్లను అడ్డుకోవడానికి గాను రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఇప్పటిదాకా ట్రైన్ బయలుదేరడానికి నాలుగు గంటలు ముందు మాత్రమే వెయిటింగ్ లిస్టు స్టేటస్ తెలుస్తోం ది. ఇకపై 24 గంటలు ముందే ఈ వివరాలు వెల్లడించడానికి రైల్వే శా ఖ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా బికనేర్ డివిజన్లో పైలట్ ప్రా జెక్టు చేపట్టినట్లు రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.