మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభు త్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణ కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తు తం ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి చదువుకునే అవకాశం ఉండగా ప్రైవేట్ స్కూళ్లలో నర్స రీ, ఎల్కెజి, యుకెజి తరగతులు నడుస్తున్నాయి. పిల్లలకు మూడేళ్ల వయసు నిండగానే తల్లిదండ్రు లు ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూ పుతున్నారని, దానివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఏటే టా విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని భావించిన రా ష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో ప్రైమరీ ప్రైమరీ ప్రా రంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 210 పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతు లు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. 202526 విద్యాసంవత్సరానికి సంబంధించి నర్సరీ, ఎల్కెజి, యుకెజి తరగతుల్లో విద్యార్థులను చేర్చుకోవాలని జిల్లా విద్యాధికారులు(డిఇఒ)లకు సూ చించింది.రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు, ఇంగ్లీష్ మీడియం విద్య లేకపోవడమే విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి ప్రధా న కారణాలు ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది.
2022-23 విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పా ఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించింది. అ యినప్పటికీ విద్యార్థుల సంఖ్య పెరగకపోగా, తగ్గు తూ వచ్చింది. తాజాగా రాష్ట్రంలో 210 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో సర్కారు బడుల్లో వి ద్యార్థులు సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించాలన్న ఉత్తర్వు లు ఆలస్యంగా వెలువడినట్లు తెలుస్తోంది. గురువారం(జూన్ 12) నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా, బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తమ పిల్లలను ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో చేర్పించాలనుకునే విద్యార్థులు ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలల్లో లేదా అంగన్వాడీల్లో చేర్పించినట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఈసారి ఎంతమంది వి ద్యార్థులను తల్లిదండ్రులు చేర్పిస్తారో వేచిచూడా లి. అయితే ప్రయోగాత్మకంగా ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభిస్తున్నప్పటికీ, వచ్చే ఏడాది నుంచి పాఠశాలలను పెంచే అవకాశం కూడా ఉంది.దాంతో ప్రభుత్వ ప్రీ ప్రైమ రీ పాఠశాలల్లో విద్యార్థుల
సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రీ ప్రైమరీలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల్లోనే ఒకటో తరగతి నుంచి కొనసాగించే అవకాశం ఉండటంతో ప్రభుత్వ బడుల్లో కూడా వి ద్యార్థుల సంఖ్య పెరగనున్నట్లు తెలుస్తోంది. విద్యా కమిషన్ కూడా ప్రీ ప్రైమరీ తరగతులను ప్రవేశపెట్టాలని ఇటీవల ప్రభుత్వానికి సూచించిన విష యం తెలిసిందే. దీనివల్ల విద్యార్థుల సంఖ్య పెరుగుతుందా..? అన్నది వేచిచూడాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కో తరగతికి సగటున 6 లక్షల మంది విద్యార్థులున్నారు. ఒకటో తరగతిలో 6 లక్షల మంది చదువుతుండగా… వారిలో 1.66 లక్షల మంది (27.66 శాతం) మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు